AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌ – పాక్‌ ఉద్రిక్త పరిస్థితులపై స్పందించిన అమెరికా, చైనా, సౌదీ దేశాలు! ఎవరు ఏమన్నారంటే..?

ఏప్రిల్ 22న పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. పాకిస్తాన్ ప్రతీకార దాడులకు తెగబడింది. అమెరికా, చైనా, సౌదీ అరేబియా, G7 దేశాలు ఈ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసి, శాంతియుత పరిష్కారాన్ని కోరాయి.

SN Pasha

|

Updated on: May 10, 2025 | 3:54 PM

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉద్రవాదులు మారణహోమం సృష్టించి 26 మందిని పొట్టనపెట్టుకోవడంతో భారత్‌ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో తమ పౌరులు చనిపోయారంటూ పాకిస్థాన్‌ ప్రతీకార దాడులకు తెగబడుతోంది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. పౌరులపై, సైనికులపై కాల్పులకు పాల్పడుతోంది. దీంతో భారత్‌ కూడా తిరిగి దాడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు యుద్ధానికి సిద్ధం అవుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా, చైనా, సౌదీ అరేబియా, జీ7 దేశాలు కూడా భారత్‌, పాక్‌ ఉద్రిక్తతలపై స్పందించాయి. వారు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉద్రవాదులు మారణహోమం సృష్టించి 26 మందిని పొట్టనపెట్టుకోవడంతో భారత్‌ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో తమ పౌరులు చనిపోయారంటూ పాకిస్థాన్‌ ప్రతీకార దాడులకు తెగబడుతోంది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. పౌరులపై, సైనికులపై కాల్పులకు పాల్పడుతోంది. దీంతో భారత్‌ కూడా తిరిగి దాడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు యుద్ధానికి సిద్ధం అవుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా, చైనా, సౌదీ అరేబియా, జీ7 దేశాలు కూడా భారత్‌, పాక్‌ ఉద్రిక్తతలపై స్పందించాయి. వారు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..

1 / 5
అమెరికా.. ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని తాను కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో రెండు దేశాల నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ వివాదాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

అమెరికా.. ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని తాను కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో రెండు దేశాల నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ వివాదాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

2 / 5
చైనా.. భారత్‌, పాకిస్తాన్‌లు శాంతి, సంయమనం పాటించాలని చైనా శనివారం విజ్ఞప్తి చేసింది. భారత్‌, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న పరిస్థితిని చైనా నిశితంగా పరిశీలిస్తోందని, ఉద్రిక్తతలు పెరగడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. "శాంతి సంయమనం పాటించాలని, శాంతియుత మార్గాల ద్వారా రాజకీయ పరిష్కార మార్గానికి తిరిగి రాకుండా ఉండాలని మేము రెండు వైపులా గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాము" అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

చైనా.. భారత్‌, పాకిస్తాన్‌లు శాంతి, సంయమనం పాటించాలని చైనా శనివారం విజ్ఞప్తి చేసింది. భారత్‌, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న పరిస్థితిని చైనా నిశితంగా పరిశీలిస్తోందని, ఉద్రిక్తతలు పెరగడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. "శాంతి సంయమనం పాటించాలని, శాంతియుత మార్గాల ద్వారా రాజకీయ పరిష్కార మార్గానికి తిరిగి రాకుండా ఉండాలని మేము రెండు వైపులా గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాము" అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

3 / 5
సౌదీ అరేబియా.. భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారా వివాదాల పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సౌదీ అరేబియా శనివారం తెలిపింది.

సౌదీ అరేబియా.. భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారా వివాదాల పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సౌదీ అరేబియా శనివారం తెలిపింది.

4 / 5
G-7 దేశాలు..  G-7 దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. "మేము, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ G-7 విదేశాంగ మంత్రులు యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధి ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత్‌, పాకిస్తాన్ రెండూ సంయమనం పాటించాలని కోరుతున్నాం. మరింత సైనిక తీవ్రత ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు. రెండు వైపులా పౌరుల భద్రత గురించి మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం" అని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.

G-7 దేశాలు.. G-7 దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. "మేము, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ G-7 విదేశాంగ మంత్రులు యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధి ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత్‌, పాకిస్తాన్ రెండూ సంయమనం పాటించాలని కోరుతున్నాం. మరింత సైనిక తీవ్రత ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు. రెండు వైపులా పౌరుల భద్రత గురించి మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం" అని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.

5 / 5
Follow us