Attack on Sikhs: న్యూయార్క్‌లో సిక్కులపై జాతి వివక్ష దాడులు.. పది రోజుల వ్యవధిలో ముగ్గురిపై దాడి

అమెరికా న్యూయార్క్‌లో సిక్కులపై జాతి వివక్ష దాడులు కలకలం రేపుతున్నాయి.. రిచ్‌మండ్‌ హిల్స్‌లో తాజాగా ఇద్దరు సిక్కులపై దాడులు జరిగాయి..

Attack on Sikhs: న్యూయార్క్‌లో సిక్కులపై జాతి వివక్ష దాడులు..  పది రోజుల వ్యవధిలో ముగ్గురిపై దాడి
Sikh Men Attacked
Follow us

|

Updated on: Apr 13, 2022 | 6:50 PM

Attack on Sikhs in US: అమెరికా(America) న్యూయార్క్‌(New York)లో సిక్కులపై జాతి వివక్ష దాడులు కలకలం రేపుతున్నాయి.. రిచ్‌మండ్‌ హిల్స్‌లో తాజాగా ఇద్దరు సిక్కులపై దాడులు జరిగాయి.. ఈ పది రోజుల వ్యవధిలో ముగ్గురు సిక్కుల మీద విద్వేషపూరిత దాడులు జరిగాయి. ఏప్రిల్ ప్రారంభంలో ఇక్కడ ఒక వృద్ధ సిక్కుపై కూడా దాడి జరిగింది. ఈ ఘటనలను న్యూయార్క్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ ఖండించింది.. కాగా దాడులకు పాల్పడ్డ ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అతనిపై హేట్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు

న్యూయార్క్‌ రిచ్‌మండ్‌ హిల్స్‌లో మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న ఇద్దరు సిక్కుల మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వారిని ఒక రాడ్‌తో కొట్టి తలపాగా లాగేశారు.. ఈ ఘటనను స్థానిక సిక్కులు, తోటి భారతీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితులకు కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.. ఇప్పటికే ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఈ దాడిని ఖండించారు, ఇది ఖండనీయమైనదని పేర్కొన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులతో తాము టచ్‌లో ఉన్నామని చెప్పారు.

కాగా పది రోజుల క్రితం న్యూయార్క్‌ రిచ్‌మండ్‌ హిల్స్‌ క్వీన్స్‌ ఏరియాలో 60 ఏళ్ల వృద్దుడు నిర్మల్‌ సింగ్‌ మీద ఇదే తరహాలో దాడి జరిగింది.. ఆయనపై ఇద్దరు వ్యక్తులు వెనుక వైపు నుంచి దాడి చేసి కొట్టారు ఈ ఘటనలో ఆయన ముక్కు విరిగింది.. నిర్మల్‌ సింగ్‌ పంజాబీ తప్ప వేరే భాష మాట్లాడలేడు.. భారత్‌ నుంచి వచ్చి తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు.. ఆయన మీద గుర్తు తెలియని వ్యక్తులు అకారణంగా దాడి చేశారు.. పోలీసులు నిందితున్ని గుర్తించి అరెస్టు చేశారు.. న్యూయార్క్‌లో పది రోజుల వ్యవధిలోనే ముగ్గురు సిక్కుల మీద దాడి జరగం ఆందోళనకు గురి చేస్తోంది పదే పదే సిక్కుల మీద దాడి జరగడాన్ని సిక్కు సమాజం తీవ్రంగా పరిగణిస్తోంది.

ఈ ఏడాది జనవరిలో, JFK అంతర్జాతీయ విమానాశ్రయంలో సిక్కు టాక్సీ డ్రైవర్‌పై దాడి జరిగింది. అందులో దాడి చేసిన వ్యక్తి అతనిని తలపాగాలతో ఉన్న వ్యక్తులు అని పిలిచి తన దేశానికి తిరిగి రావాలని కోరాడు. న్యూయార్క్ రాష్ట్ర కార్యాలయానికి ఎన్నికైన మొదటి పంజాబీ అమెరికన్ జెన్నిఫర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాలలో సిక్కు సమాజంపై విద్వేషపూరిత నేరాలు 200 శాతం పెరిగాయని చెప్పారు.

Read Also….  Nawab Malik: మనీలాండరింగ్ కేసులో ED దూకుడు.. మాజీ హోంమంత్రికి చెందిన 8 ఆస్తుల జప్తు

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు