మాలిలో ఐదుగురు భారతీయ పౌరుల కిడ్నాప్.. 4 నెలల్లో రెండవ ఘటన!

ఆఫ్రికా దేశమైన మాలిలో భారతీయ పౌరులను కిడ్నాప్ చేసిన సంఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. గురువారం (నవంబర్ 6, 2025) పశ్చిమ మాలిలోని కౌబి ప్రాంతంలో విద్యుదీకరణ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఐదుగురు భారతీయ కార్మికులను గుర్తు తెలియని ముష్కరులు అపహరించారు. ఈ కార్మికులు పనిచేస్తున్న కంపెనీ ప్రతినిధి కిడ్నాప్‌ను ధృవీకరించారు.

మాలిలో ఐదుగురు భారతీయ పౌరుల కిడ్నాప్.. 4 నెలల్లో రెండవ ఘటన!
Indians Kidnapped

Updated on: Nov 08, 2025 | 9:53 AM

ఆఫ్రికా దేశమైన మాలిలో భారతీయ పౌరులను కిడ్నాప్ చేసిన సంఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. గురువారం (నవంబర్ 6, 2025) పశ్చిమ మాలిలోని కౌబి ప్రాంతంలో విద్యుదీకరణ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఐదుగురు భారతీయ కార్మికులను గుర్తు తెలియని ముష్కరులు అపహరించారు. ఈ కార్మికులు పనిచేస్తున్న కంపెనీ ప్రతినిధి కిడ్నాప్‌ను ధృవీకరించారు. ఈ సంఘటన తర్వాత, ఇతర భారతీయ ఉద్యోగులందరినీ వెంటనే రాజధాని బమాకోలోని సురక్షిత ప్రదేశాలకు తరలించామని ఆయన అన్నారు.

ఈ కిడ్నాప్‌కు బాధ్యత వహిస్తున్నట్లు ఇంకా ఏ సంస్థ ప్రకటించనప్పటికీ, అల్-ఖైదా, ISISతో అనుబంధంగా ఉన్న ఉగ్రవాద గ్రూపుల పని అయ్యిఉంటుందని స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంవత్సరం జూలైలో, మాలిలో ముగ్గురు భారతీయ పౌరులు కూడా కిడ్నాప్‌కు గురయ్యారు. ఆ సమయంలో, అల్-ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమీన్ (JNIM) బాధ్యత వహించింది.

గత దశాబ్ద కాలంగా మాలి తిరుగుబాటులు, ప్రాణాంతక ఉగ్రవాదంతో సతమతమవుతోంది. విమోచన క్రయధనం కోసం విదేశీయులను కిడ్నాప్ చేయడం సర్వసాధారణమైంది. సహెల్ ప్రాంతం ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా మారిపోయింది. ప్రపంచంలోని ఉగ్రవాద మరణాలలో సగానికి పైగా ఇక్కడే సంభవిస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం మాలిలో దాదాపు 400 మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువగా నిర్మాణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పాల్గొంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..