ఆ పాత్రికేయుడి విగ్రహానికి ముద్దులతో మహిళల నివాళి.. ఎందుకో తెలుసా ??
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఓ జర్నలిస్ట్ విగ్రహం దగ్గరికి చాలా మంది వెళుతుంటారు. ఎక్కువ మంది మహిళలు జర్నలిస్ట్ విగ్రహానికి ముద్దులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుతుంటారు. దీని వెనుక కారణమేంటో చూసినట్లయితే.. మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ విగ్రహం ఎవరిదో తెలుసా.. విక్టర్ నొయిర్ అనే పాత్రికేయుడిది. మూడో నెపోలియన్ బంధువైన బొనాపార్టే 1870లో విక్టర్ నొయిర్ను కాల్చి చంపాడు.
ఆ రోజుల్లో మంచి పాత్రికేయుడిగా పేరు పొంది ప్రజల గొంతుకగా నిలిచిన విక్టర్ను కాల్చి చంపడంపై ఫ్రెంచి ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది. అప్పట్లోనే ఆయన అంత్యక్రియల్లో దాదాపు లక్షమంది ప్రజలు పాల్గొన్నారట. విక్టర్ చివరి క్షణాల్లో ఎలా ప్రాణాలు విడిచారో.. అదే విధంగా విగ్రహాన్ని రూపొందించి పెట్టారు. ఆయన టోపీ కూడా కాళ్ల దగ్గర పడి ఉంటుంది. ఈ విగ్రహానికి కొందరు మహిళలు ముద్దుపెట్టి నివాళులర్పిస్తుంటారు. సంతాన లేమితో బాధపడే కొందరు మహిళలు.. ఎప్పుడైతే ఈ విగ్రహానికి ముద్దు పెట్టారో ఆ తర్వాత వారికి సంతానం కలిగిందట. అదే విషయం అందరికీ చెప్పడంతో ఇప్పుడు అదో నమ్మకంగా మారింది. ఇప్పటికీ వేలాది మంది ఫ్రాన్స్ వివాహితులు విగ్రహానికి ముద్దులు పెడుతుంటారు. ఇది మూఢనమ్మకమని భావించిన అధికార యంత్రాంగం.. 2004లో ఈ సమాధి చుట్టూ కంచె వేసింది. అయితే పారిస్ మహిళలు ఆందోళనలు చేయడంతో చివరకు దాన్ని తొలగించక తప్పలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గగనయాన్ ప్రయోగం వాయిదా.. అందుకేనా ??
నిన్న శబరిమల.. నేడు కంచి.. దేవుళ్ళకే శఠగోపం పెడుతున్న కేటుగాళ్లు
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

