Elon Musk: ఈవీఎంలను హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది.. మస్క్‌ సంచలన ట్వీట్‌.. బీజేపీ రియాక్షన్ ఇదే..

టెస్లా, స్పేస్ఎక్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫా ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. రూటే సపరేటు. ఆయన తీరును అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం.. ఏం చేసినా.. ఏం మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతుంటాయి.. తాజాగా.. ఎలోన్ మస్క్ ఈవీఎం (EVM - Electronic Voting Machines) లు హ్యాకింగ్‌కు గురవ్వడంపై ఎలాన్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.

Elon Musk: ఈవీఎంలను హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది.. మస్క్‌ సంచలన ట్వీట్‌.. బీజేపీ రియాక్షన్ ఇదే..
Elon Musk

Updated on: Jun 16, 2024 | 1:29 PM

టెస్లా, స్పేస్ఎక్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫా ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. రూటే సపరేటు. ఆయన తీరును అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం.. ఏం చేసినా.. ఏం మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతుంటాయి.. తాజాగా.. ఎలోన్ మస్క్ ఈవీఎం (EVM – Electronic Voting Machines) లు హ్యాకింగ్‌కు గురవ్వడంపై ఎలాన్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఎన్నికల ప్రక్రియలో EVMలను తొలగించడంతో హ్యాకింగ్‌ను నివారించవచ్చంటూ సూచించారు. అమెరికాలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సోషల్‌ మీడియా X వేదికగా స్పందించారు మస్క్‌. EVMలను వ్యక్తులు లేదా AI సాయంతో హ్యాక్‌ చేసే ప్రమాదం ఉందని.. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుందని మస్క్‌ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో EVMలు తొలగిస్తేనే హ్యాకింగ్‌ను నివారించొచ్చు.. వ్యక్తులు లేదా AI సాయంతో హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది.. అంటూ ట్వీట్ చేశారు.

కాగా.. ప్యూర్టో రికోలో ఇటీవల తలెత్తిన ఎన్నికల వివాదాల కారణంగా అక్కడి అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి సారించారు. ప్యూర్టో రికోలో నిర్వహించిన ప్రైమరి ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు చోటు చేసుకొన్నాయన్నారు US మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌. పేపర్ ట్రయిల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించగలిగామని.. లేదంటే ఏం జరిగేదో.. ఈ సమస్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్‌లను తిరిగి తీసుకురావాలని Xలో పోస్ట్‌ చేశారు. దీనిపైనే స్పందించిన ఎలాన్‌ మస్క్‌ ఎన్నికల్లో EVMలను తొలగించడంతోనే హ్యాకింగ్‌ను నివారించొచ్చనడం చర్చనీయాంశంగా మారింది.

ఎలాన్ మస్క్ ట్వీట్..

మస్క్ పోస్ట్ పై బీజేపీ స్పందన.. రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఏమన్నారంటే..

మస్క్‌ పోస్ట్‌పై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. EVMల హ్యాకింగ్‌ ఇండియాలో సాధ్యం కాదన్నారు. ఇటీవలే సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఈవీఎంలకు ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ గానీ, వైఫై లేదా బ్లూటూత్‌ కనెక్షన్‌ లేదని గుర్తు చేశారు. అప్పుడు హ్యాకింగ్‌కు ఎలా అవకాశం ఉంటుందని రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రశ్నించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us