
జగన్నాథుడి రథయాత్రకు ఎంతో విశిష్ఠత ఉంటుంది. ఇక పూరీలో జరిగే రథయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్షల మంది ఈ యాత్రలో పాల్గొంటారు. పూరీతో పాటు పలు ప్రాంతాల్లో రథయాత్రను ఘనంగా నిర్వహిస్తారు. అయితే దేవుడి రథయాత్రలో భక్తులపై గుడ్లు విసరడం కలకలం రేపుతోంది. ఈ ఘటన కెనడాలో జరిగింది. టొరంటోలో జరిగిన రథయాత్ర ఊరేగింపులో గుర్తు తెలియని వ్యక్తులు భక్తులపై గుడ్లు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. దుండగులు ఈ దాడులతో జాత్యహంకారాన్ని ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. టొరంటో వీధుల్లో భక్తులు భక్తి గీతాలు పాడుతూ రథయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సమీపంలోని భవనం నుండి ఎవరో వారిపై గుడ్లు విసిరారు. అయినా భక్తులు మాత్రం యాత్రను కొనసాగించారు. రథయాత్రలో పాల్గొన్నప్పుడు ఏ ద్వేషం తమను కదిలించదు అని భక్తులు చెప్పడం గమనార్హం. ‘‘ఒక్కసారిగా గుడ్లు మాపై పడడంతో ఆశ్చర్యపోయాం. ఎందుకు విసురుతున్నారో అర్థం కాలేదు. కానీ మేం ఆగిపోలేదు. ఎందుకంటే ద్వేషం ఎప్పుడూ విశ్వాసాన్ని అధిగమించదు. ఏ ద్వేషం మిమ్మల్ని ఆపదు’’ అని ఓ ఎన్ఆర్ఐ భక్తుడు అన్నారు.
People throwing eggs at the ISKCON Rath Yatra in 🇨🇦 pic.twitter.com/nLsSKeOpC0
— Journalist V (@OnTheNewsBeat) July 13, 2025
ఈ సంఘటనపై ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ఈ ఘటనపై దేశం తరఫున బలమైన నిరసన తెలపాలని విదేశాంగ శాఖను కోరారు. ‘‘రథయాత్రలో భక్తులపై కోడిగుడ్లు విసిరిన వార్త విని చాలా బాధపడ్డాను. ఇటువంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్నాథ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తుంది. ఈ ఘటన లోతైన భావోద్వేగ, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఒడిశా ప్రజలకు తీవ్ర వేదనను కలిగిస్తుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి’’ అని పట్నాయక్ అన్నారు. ఈ ఘటన ఇస్కాన్ యొక్క 53వ వార్షిక రథయాత్ర సందర్భంగా జరిగింది.
Deeply disturbed to know about the reports of eggs being hurled at devotees during #RathaJatra celebrations in Toronto, Canada. Such incidents not only grievously hurt the sentiments of Lord Jagannatha’s devotees worldwide, but also cause deep anguish to the people of #Odisha,… pic.twitter.com/UeawCx6lYt
— Naveen Patnaik (@Naveen_Odisha) July 14, 2025