అత్యవసరంగా పాకిస్తాన్లో ల్యాండ్ అయిన ఇండిగో విమానం.. అత్యవసర చికిత్స అందిస్తుండగా ఒకరు మృతి..
ఢిల్లీ నుంచి దోహాకు బయల్దేరిన విమానాన్ని పాకిస్థాన్లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఓ ప్రయాణికుడికి అస్వస్థత తలెత్తడంతో విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశారు.

పాకిస్తాన్లో ఇండిగో విమానం ల్యాండ్ అయ్యింది. ఇండిగో విమానాన్ని పాకిస్థాన్లో మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఢిల్లీ నుంచి దోహాకు వెళ్లే విమానాన్ని పాకిస్తాన్లోని కరాచీలో దించేశారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ఈ-1736 ఇండిగో విమానం బయల్దేరింది. ఇది దోహాకు వెళ్లాల్సి ఉంది. అయితే, విమానం గాల్లో ఉండగానే అందులోని ఓ ప్రయాణికుడికి ఆరోగ్య పరమైన సమస్య తలెత్తాయి. పరిస్థితి విషమించడం వల్ల విమానాన్ని కిందకు దించాల్సి వచ్చింది. దీంతో ఇండిగో విమానాన్ని పాకిస్థాన్లోని కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. దురదృష్టవశాత్తూ విమానం గగనతలంలో ఉండగానే ఆ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. కరాచీ ఎయిర్పోర్ట్ వైద్య సిబ్బంది ఈ మేరకు ధ్రువీకరించారు.
సోమవారం ఉదయం 8:41 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇండిగో విమానం 11 గంటలకు ఖతార్ చేరుకోవాల్సి ఉంది. అయితే విమానం బయల్దేరిన కొద్ది సేపటికే అబ్దుల్లా అనే 60 ఏళ్ల నైజీరియన్ ప్రయాణికుడికి హెల్త్ ఇష్యూస్ రావడంతో వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది.. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కరాచీ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్కు అనుమతి కోరారు. అయితే విమానం కరాచీలో ల్యాండ్ అయ్యేలోపే ఆ ప్రయాణికుడు మరణించాడు.
దురదృష్టవశాత్తూ ప్రయాణికుడిని రక్షించలేకపోయామని విమానయాన సంస్థ తరపున చెప్పబడింది. ఎయిర్పోర్టులోని వైద్య బృందం ప్రయాణికుడు చనిపోయినట్లు ప్రకటించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం