AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azerbaijan in blast: అజర్‌బైజాన్‌లో కొనసాగుతున్న మరణ మృదంగం.. 125కు చేరిన మృతుల సంఖ్య.. పేలుడు కారణం ఇదే..

Fuel depot blast in Azerbaijan: అజర్‌బైజాన్‌లోని నాగోర్నో-కరాబాఖ్‌లోని పెట్రోల్ బంక్‌లో జరిగిన పేలుడులో ఇప్పటివరకు 125 మంది మరణించారు. మంగళవారం ఉదయం 20 మంది మృతి చెందినట్లు కరాబాఖ్ అధికారులు తెలిపారు. అయితే, దీని తర్వాత బాధితుల సంఖ్య వేగంగా పెరిగింది. ఆ ప్రాంతం నుంచి వెళ్లే నివాసితులు తమ కార్లలో ఫ్యూయల్ నింపుకునేందుకు క్యూలో నిల్చున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

Azerbaijan in blast: అజర్‌బైజాన్‌లో కొనసాగుతున్న మరణ మృదంగం.. 125కు చేరిన మృతుల సంఖ్య.. పేలుడు కారణం ఇదే..
Azerbaijan In Blast
Sanjay Kasula
|

Updated on: Sep 27, 2023 | 7:05 AM

Share

అజర్‌బైజాన్‌లోని నాగోర్నో-కరాబాఖ్‌లో మరణ మృదంగం కొనసాగుతోంది. ఫ్యూయల్ డిపోలో పేలుడు కారణంగా మ‌ృతుల సంఖ్య వందల్లోకి చేరింది. దీంతో పాటు వందలాది మంది గాయపడినట్లు తెలుస్తోంది. దాదాపు 300 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో పదుల సంఖ్యలో మృతదేహాలు లభ్యం కాగా, ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినవారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉందని అధికారులు తెలిపారు.

అజర్‌బైజాన్‌లోని నాగోర్నో-కరాబాఖ్‌లోని పెట్రోల్ బంక్‌లో జరిగిన పేలుడులో ఇప్పటివరకు 125 మంది మరణించారు. మంగళవారం ఉదయం 20 మంది మృతి చెందినట్లు కరాబాఖ్ అధికారులు తెలిపారు. అయితే, దీని తర్వాత బాధితుల సంఖ్య వేగంగా పెరిగింది. ఆ ప్రాంతం నుంచి వెళ్లే నివాసితులు తమ కార్లలో ఫ్యూయల్ నింపుకునేందుకు క్యూలో నిల్చున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

కరాబాఖ్ రాజధాని స్టెపానాకెర్ట్ సమీపంలో జరిగిన పేలుడులో మరణించిన వారి మృతదేహాలను అర్మేనియాకు తరలించినట్లు అర్మేనియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు మంగళవారం, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ (ICRC) పేలుడు కారణంగా వందలాది మంది మంటల్లో చిక్కుకున్నారని తెలిపింది.

మూడు దశాబ్దాలుగా వేర్పాటువాదుల పాలన

ఈ ప్రాంతం మూడు దశాబ్దాలుగా వేర్పాటువాదుల పాలనలో ఉంది. అజర్‌బైజాన్ సైన్యం గత వారం ప్రచారాన్ని ప్రారంభించి… ఆ ప్రాంతాన్ని పూర్తిగా క్లెయిమ్ చేయడంతో వేలాది మంది నగోర్నో-కరాబాఖ్ నివాసితులు ఆర్మేనియాకు తరలిపోతున్నారు. ఇంతలో ఈ పేలుడు ఘటన జరిగింది.

అర్మేనియా అజర్‌బైజాన్ చేతిలో..

అజర్‌బైజాన్ సైన్యం గత వారం 24 గంటల దాడిలో అర్మేనియన్ దళాలను ఓడించింది. వేర్పాటువాద అధికారులు తమ ఆయుధాలను వదలి మూడు దశాబ్దాల వేర్పాటువాద పాలన తర్వాత అజర్‌బైజాన్‌లో నాగోర్నో-కరాబాఖ్‌ను ఏకం చేయడంపై చర్చలను ప్రారంభించడానికి అంగీకరించారు.

అజర్‌బైజాన్ ఈ ప్రాంతంలోని స్థానిక అర్మేనియన్ల హక్కులను గౌరవించడానికి కట్టుబడి ఉంది. 10 నెలల దిగ్బంధనం తర్వాత ఆహార, వినియోగ వస్తువులను సరఫరాలను పునరుద్ధరిస్తానని వాగ్దానం చేసింది. అయితే చాలా మంది స్థానిక నివాసితులు ప్రతీకారం తీర్చుకుంటారని భయపడుతున్నారు. అలాంటి సమయంలో ఆర్మేనియా నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

నాగోర్నో-కరాబాఖ్ నివాసితులు..

సోమవారం సాయంత్రం నాటికి 6,500 మందికి పైగా నగోర్నో-కరాబాఖ్ నివాసితులు అర్మేనియా నుంచి పారిపోయారని అర్మేనియన్ ప్రభుత్వం తెలిపింది. నాగోర్నో-కరాబాఖ్‌లోని రష్యా శాంతి పరిరక్షకులు ప్రజలు పారిపోవడానికి సహాయం చేస్తున్నారని రష్యా తెలిపింది. సోమవారం రాత్రి వరకు శాంతి భద్రతల శిబిరంలో దాదాపు 700 మంది ఉన్నారు.

అర్మేనియన్ సైనిక మద్దతుతో..

1994లో వేర్పాటువాద యుద్ధం ముగిసినప్పటి నుండి నాగోర్నో-కరాబాఖ్ ఆర్మేనియన్ సైన్యం మద్దతుతో జాతి అర్మేనియన్ దళాల నియంత్రణలో ఉంది. 2020లో, అజర్‌బైజాన్ దాని చుట్టూ ఉన్న ప్రాంతంపై గతంలో ఆర్మేనియా నిర్ధారించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..