China Apps: భారత్‌ దెబ్బకు దిగొచ్చిన చైనా.. 54 యాప్స్ నిషేధంపై తెగ ఆందోళన..

|

Feb 18, 2022 | 7:01 AM

భద్రతా కారణాల దృష్ట్యా చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించడంపై డ్రాగన్ దేశం గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ పెట్టుబడిదారులందరినీ భారతదేశం ఆదుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

China Apps: భారత్‌ దెబ్బకు దిగొచ్చిన చైనా.. 54 యాప్స్ నిషేధంపై  తెగ ఆందోళన..
Chinese Apps
Follow us on

India Banned 54 China Apps: దేశ భద్రతకు ముప్పు కారణాల దృష్ట్యా చైనాతో సంబంధమున్న 54 యాప్స్‌పై ఇటీవల కేంద్రం నిషేధం విధించింది. కేంద్ర హోంశాఖ సిఫార్సు మేరకే వాటిని నిషేధించినట్లు తెలుస్తోంది. కాగా ఈ పరిణామంపై చైనా స్పందించింది. భారత ప్రభుత్వం(Indian Government) తీసుకున్న చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా కారణాలతో చైనా(China) దేశంతో సంబంధమున్న 54 యాప్‌లను భారత్ నిషేధించడంపై చైనా గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోంశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై స్పందించింది. చైనా సంస్థలతో సహా విదేశీ పెట్టుబడిదారులందరినీ పారదర్శకంగా, న్యాయంగా, వివక్షత చూపకుండా భారత్ ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈమేరకు ఓ ప్రకటన చేసింది. ఇందులో ‘ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సహకారం మంచి అభివృద్ధి వేగాన్ని కొనసాగించడానికి భారతదేశం ఖచ్చితమైన చర్యలు తీసుకోగలదని మేం ఆశిస్తున్నాం” అని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గావో ఫెంగ్ పేర్కొన్నారు.

ఈ 54 యాప్‌లను నిషేధించిన సమయంలో.. ‘భారత యూజర్ల నుంచి విలువైన సమాచారాన్ని ఆ యాప్స్ సేకరిస్తున్నాయి. ఈ సున్నితమైన సమాచారాన్ని చైనా సర్వర్లకు బదిలీ చేస్తున్నాయి. డేటా చౌర్యానికి పాల్పడి, దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని’ కేంద్ర హోం శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Also Read: Sydney Beache: స్విమ్మర్‌పై షార్క్‌ ఎటాక్‌.. 60 ఏళ్ల తర్వాత దారుణ ఘటన.. పలు బీచ్‌లు మూసివేత

American Woman: వైద్య చరిత్రలో మరో అద్భుతం.. స్టెమ్‌ సెల్స్‌తో.. ఎయిడ్స్‌ పూర్తిగా నయం..