AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhutan PM to PM Modi: ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే

భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే తన అభినందనలు తెలియజేశారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ భూటాన్‌ను సందర్శించినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Bhutan PM to PM Modi: ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే
Pm Modi Bhutan Pm Tshering Tobgay
Balaraju Goud
|

Updated on: Mar 23, 2024 | 6:06 PM

Share

భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే తన అభినందనలు తెలియజేశారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ భూటాన్‌ను సందర్శించినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

“ప్రధానమంత్రి మోదీ తన బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ భూటాన్‌ను సందర్శించినందుకు మేము చాలా కృతజ్ఞులం.. వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పటికీ భూటాన్ అత్యున్నత పురస్కారం స్వీకరించడానికి వ్యక్తిగతంగా వచ్చారు. మనమందరం చాలా సంతోషిస్తున్నాము, ”అని భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భూటాన్ 13వ పంచవర్ష ప్రణాళికకు సహాయాన్ని అందించినందుకు ప్రధాని మోదీకి టోబ్గే కృతజ్ఞతలు తెలిపారు.

భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ ప్రజలందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భారీ జనాభా కలిగిన పెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రధాని మోదీ భూటాన్‌కు రావాలని ఎంచుకున్నారు. తన మద్దతుతోపాటు భారత ప్రభుత్వ సహాయాన్ని అందించారని టోబ్గే చెప్పారు. అందుకు, భూటాన్ ప్రజలందరి తరపున, ప్రధానమంత్రి మోదీకి భారతదేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ అత్యున్నత గౌరవమైన ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను ప్రదానం చేశారు. థింఫులోని టెండ్రెల్తాంగ్ ఫెస్టివల్ గ్రౌండ్‌లో తన ప్రసంగంలో, ప్రధాని మోదీ ఈ గౌరవానికి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇది వ్యక్తిగత విజయం కాదు.. 140 కోట్ల భారతీయుల గౌరవం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతీయులందరి తరపున ఈ గౌరవాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నానని తెలిపారు.

అంతకుముందు థింఫులోని తాషిచో ద్జోంగ్ ప్యాలెస్‌లో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అక్కడ ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భూటాన్‌లో రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గేతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. భారతదేశం, భూటాన్ మధ్య బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ నిబద్ధతను ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us