‘కరోనా షిప్’ నుంచి అమెరికన్ల తరలింపు ?

| Edited By: Pardhasaradhi Peri

Feb 16, 2020 | 5:55 PM

జపాన్ లోని యోకోహామా రేవులో నిలిచి ఉన్న  నౌక నుంచి 428 మంది అమెరికన్లను తరలించేందుకు రెండు విమానాలు వాషింగ్టన్ నుంచి సోమవారం బయలుదేరనున్నాయి. డైమండ్ ప్రిన్సెస్  అనే ఈ నౌకలో 3,700 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది గత 10 రోజులుగా ‘బందీలు’గా ఉండిపోయారు. వీరిలో 285 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడడంతో ఇతర ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. (గత మూడు రోజుల్లోనే 67 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు). 78 మంది […]

కరోనా షిప్ నుంచి అమెరికన్ల తరలింపు ?
Follow us on

జపాన్ లోని యోకోహామా రేవులో నిలిచి ఉన్న  నౌక నుంచి 428 మంది అమెరికన్లను తరలించేందుకు రెండు విమానాలు వాషింగ్టన్ నుంచి సోమవారం బయలుదేరనున్నాయి. డైమండ్ ప్రిన్సెస్  అనే ఈ నౌకలో 3,700 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది గత 10 రోజులుగా ‘బందీలు’గా ఉండిపోయారు. వీరిలో 285 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడడంతో ఇతర ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. (గత మూడు రోజుల్లోనే 67 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు). 78 మంది బ్రిటిషర్లు తమను కూడా  ఈ నౌక నుంచి తరలించే ఏర్పాట్లు చేయాలని తమ దేశ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. వీరిలో  ముగ్గురికి ఈ వైరస్ లక్షణాలు సోకినట్టు తెలిసింది. ఇద్దరు వృధ్ద బ్రిటిష్ దంపతులు మమ్మల్ని  వెంటనే ఈ నౌక నుంచి తరలించేందుకు విమానాన్ని పంపవలసిందిగా బిలియనీర్ రిచర్డ్ బ్రాన్ సన్ ను కోరడం విశేషం. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేమని వీరు దీనంగా వేడుకుంటున్నారు.

ఈ షిప్ లో 138 మంది భారతీయులు ఉండగా.. వీరిలో ముగ్గురికి ఈ వ్యాధికి సంబంధించిన పాజిటివ్ సింప్టమ్స్ ఉన్నట్టు తెలిసింది. అయితే వారు క్రమేపీ కోలుకుంటున్నారని జపాన్ లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.  ఈ నెల 19 న వీరిని ఇండియాకు తీసుకువచ్ఛే ఏర్పాట్లు చేయవచ్చు. కాగా-చైనాలో కరోనా మృతుల సంఖ్య 1523 కి చేరింది.