AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రహాంతరవాసుల జాడ తెలిసిపోయింది..! సంచలన విషయాలు వెల్లడించిన కేంబ్రిడ్జ్‌ శాస్త్రవేత్తలు

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు భూమి నుండి 700 ట్రిలియన్ మైళ్ళ దూరంలో ఉన్న K2-18b గ్రహంపై జీవం ఉండే అవకాశంపై బలమైన ఆధారాలను కనుగొన్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ డేటా ఆధారంగా, గ్రహంపై DMS, DMDS వంటి జీవ సంబంధిత రసాయనాలను గుర్తించారు. ఇది జీవం ఉండే అవకాశాన్ని సూచిస్తున్నప్పటికీ, మరిన్ని పరిశోధనలు అవసరం అని శాస్త్రవేత్తలు అంటున్నారు.

గ్రహాంతరవాసుల జాడ తెలిసిపోయింది..! సంచలన విషయాలు వెల్లడించిన కేంబ్రిడ్జ్‌ శాస్త్రవేత్తలు
Alien
SN Pasha
|

Updated on: Apr 18, 2025 | 6:41 PM

Share

ఇతర గ్రహాలపై జీవం ఉండవచ్చనే దానికి బలమైన ఆధారాలు దొరికాయని అంతరిక్ష పరిశోధకులు అంటున్నారు. భూమి నుండి 700 ట్రిలియన్ మైళ్ల దూరంలో ఉన్న K2-18b అనే గ్రహంపై జీవం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహం భూమి కంటే రెండున్నర రెట్లు పెద్దదని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. భూమి వెలుపల ఉన్న ఇతర గ్రహాలపై జీవం ఉందా లేదా అనే దానిపై శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఏలియన్స్‌ విషయంలో చాలా మంది శాస్త్రవేత్తలు దీనిపై చురుగ్గా పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం భూమి వెలుపల మరో గ్రహంపై జీవం ఉండవచ్చని నిశ్చయాత్మక సమాచారాన్ని విడుదల చేసింది. అమెరికన్ అంతరిక్ష కేంద్రం నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ రికార్డ్ చేసిన డేటాను ఉపయోగించి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ నిపుణులు ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహంపై జీవం ఉండవచ్చనే దానికి ఈ అధ్యయనం ఆధారాలు కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూమి నుండి ఏడు వందల ట్రిలియన్ మైళ్ల దూరంలో ఉన్న K2-18b గ్రహం మీద జీవం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. K2-18b గ్రహంపై డైమిథైల్ సల్ఫైడ్(DMS), డైమిథైల్ డైసల్ఫైడ్ (DMDS) వంటి రసాయనాలు కనుగొన్నారు. ఇవి సాధారణంగా భూమిపై ఫైటోప్లాంక్టన్, బ్యాక్టీరియా వంటి జీవుల ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతాయి. దీని అర్థం సౌర వ్యవస్థ వెలుపల K2-18b అనే గ్రహంపై జీవం ఉండవచ్చని శాస్త్రవేత్తలు నమ్మకంగా ఉన్నారు. అయితే, ఈ ఆధారాలను నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. జీవం లేని కొన్ని గ్రహాలపై కూడా TMS, DMTS రసాయనాలు కనుగొన్నట్లు కొంతమంది శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఈ పరిశోధనకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ పరిశోధకురాలు నిక్కు మధుసూధన్ నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీనిని కనుగొంది. మధుసూధన్‌ భారత సంతతికి చెందినవారు. 1980లో భారతదేశంలో జన్మించిన ఆయన తరువాత అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ పొందారు. ఆయన కేంబ్రిడ్జ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.