కరోనా మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో భయపెడుతోంది. ఇండియాలోనూ కొత్త కరోనా కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. అయితే కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. లాక్ డౌన్, కఠిన నియమాలు అమలు చేసినా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పురాకపోగా.. సిట్యువేషన్ అంతకంతకూ తీవ్రంగా మారుతోంది. కరోనా చేస్తున్న విలయతాండవాన్ని డ్రాగన్ దేశం విలవిల్లాడుతోంది. వందల సంఖ్యలో మరణిస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వైరస్ మరింత ఉద్ధృతమై లక్షల్లో ప్రాణాలు పోవచ్చనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మహమ్మారినుంచి తప్పించుకునేందుకు ప్రజలు నానా తిప్పలు పడుతుంటే.. ఓ ప్రముఖ మహిళా సింగర్ మాత్రం ఉద్దేశపూర్వకంగా కరోనా వైరస్ను అంటించుకుంది.
వచ్చే నూతన సంవత్సర వేడుకల్లో తను ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉందని. ఆ సమయంలో కరోనా వస్తే ఇబ్బంది.. అదేదో ఇప్పుడే వచ్చేస్తే ఓ పనైపోతుంది కదా అంటోంది. అందుకోసం వైరస్ సోకిన కొందరి ఇళ్లకు వెళ్లి నేరుగా వాళ్లను కలిసిందట. దాంతో ఆమెకు వైరస్ సోకిందట. దీంతో నూతన సంవత్సర వేడుకల నాటికి వైరస్ నుంచి కోలుకునేందుకు సమయం దొరికింది’ అంటూ జేన్ ఝాంగ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించడంతో సోషల్మీడియాలో సదరు సింగర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కథనాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు కూడా ప్రచురించింది.
చైనాలో ప్రమాదకరమైన బీఎఫ్.7 వేరియంట్ వణికిపోతోన్న వేళ.. ఓ సింగర్ ఇటువంటి ప్రకటన చేయడం వైరల్గా మారింది. ఆమె తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతోపాటు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని నెటిజన్లు మండిపడ్డారు. దీనిపై స్పందించిన జేన్ ఝాంగ్.. వెంటనే క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో ఆ పోస్టును తొలగించారు.
Singer #JaneZhang says that she’s worried she’ll be sick for New Years concerts, so she decided to visit some covid+ people to get sick and get over it
Now she’s getting bashed because she said she recovered in 1 day, lost weight and now has good skin? pic.twitter.com/wyki8v2wrZ
— ? 田里的猹 (@melonconsumer) December 17, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..