Youtuber: పార్టీకి పబ్కి పిలిచి.. రేప్ కేసులో ఇరికిస్తానని చెప్పి.. రూ 80లక్షలు దోపిడీ.! వీడియో.
యూట్యూబ్ ఛానెల్లో తన కంపెనీని ప్రమోట్ చేస్తానని పరిచయం చేసుకుంది. ఆతర్వాత అతనితో స్నేహం చేసింది, నువ్వంటే నాకిష్టం.. పెళ్లిచేసుకుందాం అంది.. ఇంకేముంది మనోడు పడిపోయాడు...
ఢిల్లీకి చెందిన నమ్రా ఖదీర్ అనే మహిళ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ఈమె ఛానల్కు 6 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఢిల్లీలోని బాద్షాపూర్లో దినేశ్ యాదవ్ అనే యువకుడు అడ్వర్టయిజింగ్ సంస్థను నడుపుతున్నాడు. ఈక్రమంలో న్రమా ఖదీర్, ఆమె భర్త బేనీవాల్తో దినేష్ యాదవ్కు పరిచయం ఏర్పడింది. వారి యూట్యూబ్ ఛానల్లో తమ సంస్థను ప్రమోట్ చేయాలని వారిని అడిగాడు. అందుకు నమ్రా 2 లక్షలు తీసుకుంది. అలా కొన్నాళ్లకు నమ్రా ఖదీర్, దినేష్ను ఇష్టపడుతున్ననని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పింది. అలా వారి మధ్య స్నేహం కొనసాగింది. ఈ క్రమంలో దినేష్, నమ్రా దంపతుల ఆహ్వానం మేరకు ఓ క్లబ్లో పార్టీకి వెళ్లాడు. రాత్రి ఆలస్యం కావడంతో అక్కడే రూమ్ బుక్ చేసుకొని ఉన్నారు. మర్నాడు ఉదయం దినేశ్ నిద్ర లేచే సరికి నమ్రా అతడి బ్యాంకు కార్డులు, వాచ్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే అత్యాచారం కేసులో ఇరికిస్తానంటూ బెదిరించింది. అలా దాదాపు 80 లక్షల నగదుతోపాటు, విలువైన కానుకలు కూడా దోచుకుంది. చివరికి బాధితుడు లబోదిబోమంటూ విషయం అతని తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నమ్రాఖదీర్ను అరెస్ట్ చేశారు. నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సహ నిందితుడైన ఆమె భర్త బేనీవాల్ను త్వరలోనే అరెస్టు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్కు మేయర్ ప్రకటన..