Corona: కరోనా ప్రళయ తాండవం.. ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్.. విలవిల్లాడుతున్న కంట్రీ..
పుట్టింటిపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. మహమ్మారి దెబ్బకు చైనా విలవిల్లాడుతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో డ్రాగన్ కంట్రీ గడగడలాడుతోంది.
డిసెంబర్ నెలలో 20 రోజుల్లో దాదాపు 24.8 కోట్ల మందికి వైరస్ సోకింది. ఇది చైనా మొత్తం జనాభాలో 18 శాతానికి సమానం. ఈ క్రమంలో చైనా నేషనల్ హెల్త్ కమిషన్ డిసెంబర్ 23న అంతర్గతంగా సమావేశమయింది. ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ లో దిగ్భ్రాంతికి గురి చేసే ఈ విషయం వెలుగుచూసింది. అంతేకాదు, డిసెంబర్ మూడో వారంలో ఒకే రోజున 3.7 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. చైనాలో ఇంతకు ముందు ఒకే రోజున నమోదైన అత్యధిక కేసుల సంఖ్య 40 లక్షలు. 2022 జనవరి 19న ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఒకే రోజున దాదాపు 4 కోట్ల కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలో కూడా ఒకే రోజున ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఈ కేసుల సంఖ్యను చూస్తే చైనాలో కరోనా తీవ్రత ఎంత భయంకరంగా ఉందో తెలస్తోంది. అయితే ఈ మీటింగ్ మినిట్స్ లో కరోనా మరణాలు ఎన్ని నమోదయ్యాయనే విషయాన్ని మాత్రం పేర్కొనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!
కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే..
శ్మశానంలో మండుతున్న చితుల మధ్య "హోలీ' ఎక్కడంటే..

