Corona: కరోనా ప్రళయ తాండవం.. ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్.. విలవిల్లాడుతున్న కంట్రీ..

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Jan 04, 2023 | 8:00 PM

పుట్టింటిపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. మహమ్మారి దెబ్బకు చైనా విలవిల్లాడుతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో డ్రాగన్‌ కంట్రీ గడగడలాడుతోంది.


డిసెంబర్ నెలలో 20 రోజుల్లో దాదాపు 24.8 కోట్ల మందికి వైరస్ సోకింది. ఇది చైనా మొత్తం జనాభాలో 18 శాతానికి సమానం. ఈ క్రమంలో చైనా నేషనల్ హెల్త్ కమిషన్ డిసెంబర్‌ 23న అంతర్గతంగా సమావేశమయింది. ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ లో దిగ్భ్రాంతికి గురి చేసే ఈ విషయం వెలుగుచూసింది. అంతేకాదు, డిసెంబర్‌ మూడో వారంలో ఒకే రోజున 3.7 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. చైనాలో ఇంతకు ముందు ఒకే రోజున నమోదైన అత్యధిక కేసుల సంఖ్య 40 లక్షలు. 2022 జనవరి 19న ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఒకే రోజున దాదాపు 4 కోట్ల కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలో కూడా ఒకే రోజున ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఈ కేసుల సంఖ్యను చూస్తే చైనాలో కరోనా తీవ్రత ఎంత భయంకరంగా ఉందో తెలస్తోంది. అయితే ఈ మీటింగ్ మినిట్స్ లో కరోనా మరణాలు ఎన్ని నమోదయ్యాయనే విషయాన్ని మాత్రం పేర్కొనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu