Attacks on Trains: రైళ్లపై దాడులు చేయండి.! స్లీపర్ సెల్స్కు పాక్ ఉగ్రవాది వీడియో కాల్..
దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ స్లీపర్ సెల్స్కు ఒక ఉగ్రవాది సూచించిన వీడియో కలకలం సృష్టిస్తోంది. రామేశ్వరం కేఫ్ తరహాలో ఉగ్రదాడులకు అతడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫర్హతుల్లా ఘోరి పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ సహకారంతో స్లీపర్ సెల్ ద్వారా రామేశ్వరం కేఫ్లో బ్లాస్ట్కు పాల్పడ్డాడు. దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ స్లీపర్ సెల్స్కు ఒక ఉగ్రవాది సూచించిన వీడియో కలకలం సృష్టిస్తోంది.
దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ స్లీపర్ సెల్స్కు ఒక ఉగ్రవాది సూచించిన వీడియో కలకలం సృష్టిస్తోంది. రామేశ్వరం కేఫ్ తరహాలో ఉగ్రదాడులకు అతడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫర్హతుల్లా ఘోరి పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ సహకారంతో స్లీపర్ సెల్ ద్వారా రామేశ్వరం కేఫ్లో బ్లాస్ట్కు పాల్పడ్డాడు.
ప్రస్తుతం పాకిస్థాన్లో ఉంటున్న ఫర్హతుల్లా ఘోరిపై కొన్నేళ్లుగా భారత్ నిఘా పెట్టింది. అతడు ఆదేశాలు ఇస్తున్న మూడు నిమిషాల వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అందులో రైళ్లు, పెట్రోలియం పైప్లైన్లపై దాడులు, ప్రెజర్ కుక్కర్లు ఉపయోగించి పేలుళ్లు జరపాలంటూ పిలుపునిచ్చాడు. స్లీపర్ సెల్స్ ఆస్తులపై దాడులు చేయడం ద్వారా భారత ప్రభుత్వం వారిని బలహీనపరుస్తోందని ఘోరి అన్నాడు. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని షేక్ చేయాలంటూ ప్రగల్భాలు పలికాడు. దీంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యయి.
పలు పేలుళ్ల వెనక ఘోరి హస్తం ఉంది. 2002లో గుజరాత్లోని అక్షరధామ్ ఆలయం దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మంది గాయపడ్డారు. అలాగే 2005లో హైదరాబాద్లోని టాస్క్ఫోర్స్ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో అతడి ప్రమేయం ఉంది. ఘోరితో పాటు అతడి అల్లుడు షాహిద్ ఫైజల్.. దక్షిణ భారతదేశంలో స్లీపర్సెల్స్ నెట్వర్క్ను నిర్వహిస్తున్నారు. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితులతో ఫైజల్ సంప్రదింపులు జరిపాడని అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

