భారీ శబ్ధంతో కూలిన బ్రిడ్జి.. ఎక్కడంటే..
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో టిబెట్ను కలిపే హాంగ్ కీ బ్రిడ్జి ప్రారంభమైన కొద్ది రోజులకే కుప్పకూలింది. 758 మీటర్ల పొడవైన ఈ వంతెన కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రమాద సమయంలో వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చైనా ఇంజినీరింగ్ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
చైనాలో ఇంజినీరింగ్ వైఫల్యం బయటపడింది. చైనాను టిబెట్తో కలిపేలా ఇటీవలే ప్రారంభించిన హాంగ్ కీ బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయింది. చైనా సియాచిన్ ప్రావిన్స్ లో నిర్మించిన ఈ బ్రిడ్జి 758 మీటర్ల పొడవైంది. వంతెన కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సియాచిన్ ప్రావిన్స్ లో టిబెట్ తో చైనాను కలుపుతూ నిర్మించిన హాంగ్ కీ బ్రిడ్జ్ను కొద్దిరోజుల కిందటే ప్రారంభించారు. కాగా మంగళవారం ఉదయం సమయంలో బ్రిడ్జ్ ప్రారంభంలోని భాగం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపైనుంచి వాహనాలు ఏమి వెళ్లకపోవడం, అక్కడ ప్రజలెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే వంతెన కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. వంతెన కూలిన సమయంలో భారీగా శిథిలాలు నదిలో పడిపోయి పెద్ద ఎత్తున వ్యర్థాలు పైకి లేచాయి. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. పారిశ్రామిక రంగం లో తామెప్పుడూ ముందుంటాం అని చెప్పుకునే డ్రాగన్ దేశంలో ఇంత పెద్ద వంతెన నిర్మించిన కొద్ది రోజుల్లోనే కూలిపోవడం ఏంటని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
టీమిండియా అండర్-19 జట్టులో హైదరాబాదీకి ఛాన్స్
రూటు మార్చిన చైన్ స్నాచర్లు.. డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

