భర్త అంటే ఇష్టం లేని భార్య ఏం చేసిందో చూడండి వీడియో
రాను రాను వివాహ బంధానికి విలువ లేకుండా పోతోంది. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జంట కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ కలకాలం తోడునీడగా ఉంటామని పెళ్లిలో చేసిన ప్రమాణాలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు, ప్రేమ పేరుతో భార్య, లేదా భర్తను దారుణంగా హతమార్చుతున్నారు. ఇష్టం లేని పెళ్లిళ్లకు నిండు ప్రాణాలు బలైపోతున్నాయి.
మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరువక ముందే మరో మహిళ తన భర్త అంటే తనకు ఇష్టం లేదని పెళ్లయిన 36 రోజులకే భర్తకు భోజనంలో పురుగుల మందు కలిపి పెట్టి హతమార్చింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్లోని విష్ణుపూర్ గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్ కుమార్తె సునీతను మే 11న జార్ఖండ్ లోని గర్హ్వా జిల్లా బహోకుందర్ గ్రామానికి చెందిన బుధ్నాథ్ సింగ్ అనే వ్యక్తికి ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. అయితే, వివాహం జరిగిన మరుసటి రోజే నవ వధువు సునీత తనకు భర్త అంటే ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు పంచాయతీ పెట్టి సునీతకు నచ్చజెప్పి మళ్లీ తనను కాపురానికి పంపించారు.
మరిన్ని వీడియోల కోసం :
సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో
యాంకర్ లైవ్ వార్తలు చదువుతుండగా..ఊహించని ఘటన వీడియో
ఆకాశంలో అద్భుతం.. విశ్వంలో ఉన్న బుల్లి గెలాక్సీల వీడియో
EPFO గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఆ సేవలు
స్మార్ట్ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న ధరలు!
టైగర్ సఫారీలో జీప్లో పర్యాటకులు..కళ్ళెదుట ఆ సీన్ చూసి షాక్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
