AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

600 కి.మీ. డ్రైవ్ చేసుకుంటూ ప్రియుడికోసం వచ్చింది... చివరికి..

600 కి.మీ. డ్రైవ్ చేసుకుంటూ ప్రియుడికోసం వచ్చింది… చివరికి..

Ram Naramaneni
|

Updated on: Sep 16, 2025 | 8:37 PM

Share

జున్‌జున్‌కు చెందిన ముకేష్ కుమారి అనే 37 ఏళ్ల మహిళ తన ఫేస్‌బుక్‌ ప్రియుడు మనోరంను కలవడానికి 600 కిలోమీటర్లు ప్రయాణించింది. ప్రియుడితో వాగ్వాదం తర్వాత మనోరం ఆమెను ఇనుప రాడ్‌తో కొట్టి చంపాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన సంబంధాల ప్రమాదకర పర్యవసానాలకు ఇది ఘోర ఉదాహరణ.

రాజస్థాన్‌లోని జున్‌జున్‌కు చెందిన 37 ఏళ్ల ముకేష్ కుమారి, ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన ప్రియుడు మనోరంను కలవడానికి 600 కిలోమీటర్లు ప్రయాణించింది. అంగన్వాడీ సూపర్‌వైజర్‌గా పనిచేసే ముకేష్ కుమారి, భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన మనోరం, తన భార్యతో విభేదాల కారణంగా విడాకుల కేసు వేశాడు. ముకేష్ కుమారి, మనోరంల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. సెప్టెంబర్ 10న మనోరంను కలవడానికి కారులో భరమాకు వచ్చిన ముకేష్ కుమారి, మనోరం తో వాగ్వాదంలో చిక్కుకుంది. ఆగ్రహించిన మనోరం కారులో ఉన్న ఇనుప రాడ్‌తో ముకేష్ కుమారి తలపై కొట్టడంతో ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.