ఆర్డర్ చేయని ఫుడ్‌కూ బిల్లు వేసిన IRCTC

కొన్ని సందర్భాల్లో అప్పటికప్పుడు ప్రయాణం చేయాల్సి రావచ్చు. మనం బయలుదేరే వేళకు అందుబాటులో ఉన్న రైలుకో, బస్సుకు బయలుదేరి వెళతాం. ముందే అనుకోకుండా సడెన్‌గా ప్రయాణమైనప్పుడు భోజనం విషయాన్ని పట్టించుకోం. రైలులో ప్రయాణిస్తే భారతీయ రైల్వేల అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ భోజన వసతి కల్పిస్తుంది. అయితే రైలు ప్రయాణికులు వెజ్ థాలీ ఆర్డర్ చేస్తే, ఐఆర్సీటీసీ సిబ్బంది దాంతో పాటు పనీర్ సబ్జీకి కలిపి బిల్లు వేసిన ఘటన ఢిల్లీ బ్రహ్మపుత్ర ఎక్స్ ప్రెస్ ట్రైన్‌లో జరిగింది.

ఆర్డర్ చేయని ఫుడ్‌కూ బిల్లు వేసిన IRCTC

|

Updated on: Dec 16, 2023 | 11:21 AM

కొన్ని సందర్భాల్లో అప్పటికప్పుడు ప్రయాణం చేయాల్సి రావచ్చు. మనం బయలుదేరే వేళకు అందుబాటులో ఉన్న రైలుకో, బస్సుకు బయలుదేరి వెళతాం. ముందే అనుకోకుండా సడెన్‌గా ప్రయాణమైనప్పుడు భోజనం విషయాన్ని పట్టించుకోం. రైలులో ప్రయాణిస్తే భారతీయ రైల్వేల అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ భోజన వసతి కల్పిస్తుంది. అయితే రైలు ప్రయాణికులు వెజ్ థాలీ ఆర్డర్ చేస్తే, ఐఆర్సీటీసీ సిబ్బంది దాంతో పాటు పనీర్ సబ్జీకి కలిపి బిల్లు వేసిన ఘటన ఢిల్లీ బ్రహ్మపుత్ర ఎక్స్ ప్రెస్ ట్రైన్‌లో జరిగింది. అలా రొచి కొచ్చా అనే ఓ మహిళా రచయిత తన కుటుంబంతో బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్‌లో కలిసి పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరారు. పది మందితో బయలు దేరినందున ఫుడ్ కోసం ఐఆర్సీటీసీ క్యాటరింగ్‌ కి వెజ తాలీ భోజనం ఆర్డర్ చేశారు. ఫుడ్‌తోపాటు బిల్లు కచ్చితంగా ఇవ్వాలని కూడా స్పష్టంగా చెప్పారామె. కానీ ఐఆర్సీటీసీ క్యాటరింగ్ సిబ్బంది వెజ్ థాలీకి రూ.80 తోపాటు పనీర్ సబ్జీకి రూ.70 కలిపి బిల్లు వేశారు. తాము కేవలం వెజ్ తాలీ భోజనం మాత్రమే ఆర్డర్ చేసినా వినిపించుకోకుండా గంటసేపు వాదించారనీ ఆ తర్వాత ఓ అధికారి వచ్చి వెజ్ థాలీకి రూ.80 బిల్లు ఇచ్చి వెళ్లారని ఆమె చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్ స్టేషన్ల నిర్మాణానికి ముందుకొచ్చిన అమెరికన్‌ స్టార్టప్‌

ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా !! కూతురిని తల్చుకొని

Manchu Lakshmi: మంచు లక్ష్మీ పార్టీలో రామ్‌ చరణ్‌ వీడియో…

Deepika Padukone: తిరుమలలో దీపిక దారుణ కామెంట్స్ !!

అమ్మాయిపై అత్యాచారం.. అరెస్ట్ అయిన యూట్యూబర్‌

 

Follow us