TV9 Conclave 2024: కాంగ్రెస్ ఏడాది పాలనపై టీవీ9 ప్రత్యేక కాంక్లేవ్.. ఎప్పుడంటే
ప్రజల పార్టీ నినాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తోంది. ఈ నెల 9వ తేదీ నాటికి కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం..
ప్రజా పార్టీ నినాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తోంది. ఈ నెల 9వ తేదీ నాటికి కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సాహలు నిర్వహిస్తోంది. నవంబర్ 14 నుంచి మొదలైన ఈ సెలబ్రేషన్స్.. డిసెంబర్ 9వ తేదీతో పూర్తవుతాయి. మొత్తం 26 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో సంబరాలు జరుగుతాయి. ఇలాంటి తరుణంలో ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో వచ్చిన మార్పు ఎంత.? ప్రతిపక్షం చెబుతున్న విధ్వంసం ఎంత.? ప్రజా ఆమోదం ఎంత.? ప్రభుత్వ వ్యతిరేకత మరెంత.? ఇందులో ఏది నిజం.? ఏది ప్రచారం..? ఇవన్నీ తెలియాలంటే.. ‘What Telangana Thinks Today’ టీవీ9 కాంక్లేవ్ 2024 చూడాల్సిందే. ఈ ఆదివారం ఉదయం 10 గంటలకు మీ టీవీ9లో..
ఈ కాంక్లావ్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ హాజరు కానున్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తమ మనసులోని మాటలను వ్యక్తపరచనున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

