ఆవుకు తులాభారం !! ఆ నాణేలను ఏం చేశారంటే ??
హిందువులు ఆవును గోమాతగా, సకల దేవతా స్వరూపంగా భావిస్తారు. ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తుండటం.. లక్ష్మీస్వరూపంగా భావించే గోమాతకు తులాబారం నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు కొందరు గ్రామస్తులు. తూర్పుగోదావరి జిల్లా,రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని గోమాతకు ధన తులాభారం అంగరంగ వైభవం గా నిర్వహించారు.
హిందువులు ఆవును గోమాతగా, సకల దేవతా స్వరూపంగా భావిస్తారు. ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తుండటం.. లక్ష్మీస్వరూపంగా భావించే గోమాతకు తులాబారం నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు కొందరు గ్రామస్తులు. తూర్పుగోదావరి జిల్లా,రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని గోమాతకు ధన తులాభారం అంగరంగ వైభవం గా నిర్వహించారు. కోరుకొండకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో మండలంలోని బొలెద్దుపాలెం గ్రామంలో స్థానిక రామాలయం వద్ద గ్రామస్తుల సహకారంతో ఈ గోధన తులాభారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు లక్షా ముప్పైవేల విలువ గల చిల్లర నాణాలతో గోమాతకు తులాబారం కార్యక్రమం చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి 11 చిల్లర నాణాల వంతున సేకరించి, ఈ మహాక్రతువులో వినియోగించారు. ఈ కార్యక్రమంలో స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలవారు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని గోమాతపై తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు శ్రావణమాసపు పౌర్ణమి రోజున తమ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, హిందూ తత్త్వం మరింత ప్రజలకు చేరువవుతుందని తెలిపారు. గోమాత తులా బారంతో లక్ష్మీదేవి కృపకు తామంతా పాత్రులమయ్యామన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Explainer: భారత్ లో డెంగ్యూ డేంజర్ బెల్స్ !! ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

