రెండు కేజీల నువ్వుల నూనెను గటగటా తాగేసింది!
తెలంగాణా రాష్ట్రం అసీఫాబాద్ జిల్లాలో ఆదివాసీల సంప్రదాయ ఖాన్దేవుని జాతర మొదలైంది. ఈ క్రమంలోనే నార్నూర్ మండల కేంద్రంలో ఖాన్దేవుని జాతరలో మహాపూజ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు తొడసం జాతికి చెందిన ఆదివాసీలు. 15 రోజుల పాటు ఖాన్దేవుని సన్నిధిలో జాతర జరుగుతుంది.
కొన్ని దశాబ్దాల నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజున ఖాన్దేవునికి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఖాన్దేవునికి నైవేద్యం పెట్టేందుకు నెలరోజుల ముందు నుంచే ఆదివాసీలు ఇంట్లోనే నువ్వులనూనె తయారుచేస్తారు. అలా తయారు చేసిన నూనెను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలా ప్రతీ ఇంటినుంచి తీసుకువచ్చిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్గఢ్ నుంచి తరలివస్తారు తొడసం వంశస్తులు. మహరాష్ట్ర కోద్దిపూర్ గ్రామనికి చెందిన తొడసం వంశస్తుల ఆడపడుచు మెస్రం నాగుబాయి రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. ఇలా మొక్కడం వలన సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. వందేళ్లుగా ఈ ఆచారం వస్తుందని, తొడసం ఆడపడుచులు మూడేళ్లకోసారి ఒకరు నువ్వుల నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ కమిటీ వెల్లడించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓరి దేవుడో.. ఇదేం వెరైటీ ఫుడ్! కోక్ తో ఆమ్లెట్టా ?? ఎలా చేశాడంటే..
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

