త్వరలో భూమి సముద్రంలో కలిసిపోనుందా..! శాస్త్రవేత్తల ఆందోళనకు కారణమేంటి?

Edited By: Ram Naramaneni

Updated on: Apr 12, 2025 | 10:23 PM

కలియుగం త్వరలో అంతమైపోతుంది.. భూమి కనరుమరుగైపోతుంది.. మావనావళి తుడిచిపెట్టుకుపోతారనే వార్తలు కొన్నేళ్లుగా వింటూనే వస్తున్నాం. ఇప్పటివరకూ అలాంటి దాఖలాలేవీ కనబడలేదు. ఎందుకంటే ఇలాంటి వార్తలకు ఎలాంటి మూలం ఉండదు.. శాస్త్రీయ ఆధారాలు అసలే ఉండవు. ఎవరో కొందరు వ్యక్తులు, చారిత్రక గ్రంథాల్లో ఉన్న వాటి ఆధారంగా భూమి అంతం.. మానవాళి కనుమరుగు అనే విషయాలు వెల్లడిస్తుంటారు.

కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో మాత్రం ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. అతి త్వరలోనే భూమి కనుమరుగవుతుందనడానికి సాక్ష్యంగా నిలుస్తుంది ఈ వీడియో. ఈ వీడియో చూసిన జనాలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వీడియో ప్రపంచ నాశనం గురించి పక్కా ఆధారాలతో చూపిస్తోంది. దీని ప్రకారం అతి త్వరలోనే భూమి సముద్రంలో కలిసిపోబోతోందనేది స్పష్టం అవుతోంది. ఇంతకు ఆ వీడియోలో ఏం ఉంది.. ఈ వీడియో ఎవరు రికార్డ్ చేశారంటే.. ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ భూధృవాలకు సంబంధించిన వీడియోని రికార్డ్ చేసింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పేస్ ఎక్స్ ద్వారా నలుగురు వ్యక్తులు.. ది ఫ్రేమ్ 2 మిషన్ స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి వెళ్లి.. ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసాన్ని చేశారు. భూమి మీద ఉన్న ఉత్తర, దక్షిణ ధృవాలను వీడియో తీశారు. 90 డిగ్రీల కోణంలో ఈ వీడియోలను రికార్డ్ చేశారు. దీనిలో ధృవ ప్రాంతంలోని మంచు దిబ్బలు కనువిందు చేస్తున్నాయి. అంతరిక్షం నుంచి చూస్తుంటే.. మంచు కూడా నీలం రంగులో కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా ?? గుండె మీద చెయ్యేసుకుని చూడండి!

ఆ వస్తువులను ముట్టుకున్నారా? వెంటనే చేతులు కడుక్కోండి.. లేదంటే..

చొక్కాలు విప్పి.. ‘ఎక్స్‌ప్రెస్ వే’ పై ఓవరాక్షన్

క్యారెట్ జ్యూస్‌ తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలివే

రైలును ఆపేసి మరీ ఈ లోకో పైలట్‌ చేసిన పనికి.. అందరు షాక్

Published on: Apr 12, 2025 01:42 PM