మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో
మొంత తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దిగువ ట్రోపో ఆవరణంలో గాలులు, ఉపరితల చక్రవాత ఆవర్తనం దీనికి కారణం. పలు జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది.
మొంత తుఫాను ఏపీని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. పలు జిల్లాలు నీటమునగడంతో పాటు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొంత తుఫాను శాంతించినప్పటికీ, దాని ప్రభావం ఇంకా తెలుగు రాష్ట్రాలపై కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి.
Follow Us
వైరల్ వీడియోలు
పాతబస్తీలో రెచ్చిపోయిన ఆటోడ్రైవర్..
సింగరేణి ఖిల్లాలో 'అమెరికా' కోడలు
షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్న టెన్త్ విద్యార్ధినిలు..
సిరిసిల్లలో పులి పంజా.. రంగంలోకి హైదరాబాద్ బృందం
ప్రపంచ వేదికపై తెలుగు తేజం !! సిక్కోలు యువకుడి ఘనత
చూపు కోల్పోయిన 9 మంది.. వికటించిన కంటి వైద్యం
శ్రీశైలం మల్లన్నకు కాసుల వర్షం..13 రోజుల్లోనే ఏకంగా..

