Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాఠాలు చెబుతానని.. పాడుపని చేసినందుకు పాతికేళ్ల జైలు

పాఠాలు చెబుతానని.. పాడుపని చేసినందుకు పాతికేళ్ల జైలు

Phani CH

|

Updated on: Jan 01, 2024 | 3:14 PM

బ్రతుకు తెరువుకోసం ట్యూషన్‌ సెంటర్‌ ప్రారంభించాడు. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థినిలకు పాఠాలు చెప్పాల్సిన అతని బుద్ధి వక్రించింది. పిల్లలకు పాఠాలు చెబుతూనే వారిపై కన్నేశాడు. టెన్త్‌ క్లాస్‌ చదువుతున్న ఓ విద్యార్ధినిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. బాలిక విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కా ఆధారాలతో పోలీసులు కోర్టులో చార్జి సీటు ఫైల్ చేశారు.

బ్రతుకు తెరువుకోసం ట్యూషన్‌ సెంటర్‌ ప్రారంభించాడు. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థినిలకు పాఠాలు చెప్పాల్సిన అతని బుద్ధి వక్రించింది. పిల్లలకు పాఠాలు చెబుతూనే వారిపై కన్నేశాడు. టెన్త్‌ క్లాస్‌ చదువుతున్న ఓ విద్యార్ధినిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. బాలిక విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కా ఆధారాలతో పోలీసులు కోర్టులో చార్జి సీటు ఫైల్ చేశారు. సాక్షాధారాలను పరిశీలించిన న్యాయస్థానం అతనికి 25 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. విశాఖ జిల్లా అక్కయ్య పాలెంకు చెందిన పదహారేళ్ల బాలిక టెన్త్ చదువుతోంది. ఆమెను స్థానిక ట్యూషన్ సెంటర్లో చేర్పించారు. బాలికకు ట్యూషన్ చెప్పే నిర్వాహకుడు జ్ఞానేశ్వర్ రావు కన్ను ఆ బాలికపై పడింది. పాఠాలు చెబుతూనే ఆ బాలికను అసభ్యకరంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. విద్యార్థులంతా బయటకు వెళ్లాక ఆ బాలికను ఆపి లైంగికంగా వేధించేవాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ayodhya: అయోధ్యలో కొలువుదీరే రాముడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది.

ఫ్రీ అని బస్సెక్కారు.. సీట్ల కోసం సిగపట్లు పట్టారు

మత్స్యకారుల పంటపండింది.. వలలో పడ్డ అతిపెద్ద చేప..

తాగొచ్చిన కానిస్టేబుల్…స్టేషన్లో ఏం చేశాడో తెలుసా ??

వంతెన కింద ఇరుక్కున్న విమానం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌