కోళ్ల వ్యాన్ బోల్తా.. వరి పొలం అని కూడా చూడ్లేదు.. ఈ జనాలను చూడండి

|

Oct 22, 2022 | 9:45 AM

కోళ్ల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో గ్రామస్తులు పండగ చేసుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామం నుండి సిద్దిపేటకు 1200 కోళ్లు తీసుకొని వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

కోళ్ల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో గ్రామస్తులు పండగ చేసుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామం నుండి సిద్దిపేటకు 1200 కోళ్లు తీసుకొని వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కోళ్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న లక్ష్మాపూర్ గ్రామస్తులతో పాటు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దొరికిన కోళ్లను దొరికినట్టుగా తీసుకెళ్లిపోయారు. కొన్ని కోళ్లు రోడ్డు పక్కనే ఉన్న వరిపొలంలో పడ్డాయి. కోతకు వచ్చిన వరి పొలం అని కూడ చూడకుండా కోళ్ల కోసం పొలంలోకి దిగారు కొందరు. దొరికాయ్‌రా నా సామి రంగా అంటూ ఇళ్లకు పరుగులు తీశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పోటీలో గెలిచిన అమ్మాయిలకు బహుమతిగా ఎన్నారై పెళ్లికొడుకు !!

విద్యార్ధినిని 500 మీటర్లు ఈడ్చుకుపోయిన ఆటోడ్రైవర్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో.. గంటన్నరలో రూ. 70 లక్షలు

News Watch: గులాబీ పార్టీలోకి వలసల జోరు మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్..

Follow us on