AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెరైటీ దొంగలు.. ఏం దోచుకెళ్లారో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు

వెరైటీ దొంగలు.. ఏం దోచుకెళ్లారో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు

Phani CH
|

Updated on: Jun 29, 2024 | 10:58 AM

Share

సాధారణంగా దొంగలు ఇళ్లు, దుకాణాల్లో చోరీలకు పాల్పడటం చూశాం. బంగారం, నగదు లేదా విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం మనకు తెలుసు. కానీ లైబ్రరీలో దొంగతనానికి పాల్పడటం ఎప్పుడైనా చూశారా? శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి గ్రంథాలయం తాళాలు పగలగొట్టి.... అడ్డొచ్చిన వాచ్‌మెన్ ని బెదిరించి గ్రంథాలయాన్ని దోచుకున్నారు.

సాధారణంగా దొంగలు ఇళ్లు, దుకాణాల్లో చోరీలకు పాల్పడటం చూశాం. బంగారం, నగదు లేదా విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం మనకు తెలుసు. కానీ లైబ్రరీలో దొంగతనానికి పాల్పడటం ఎప్పుడైనా చూశారా? శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి గ్రంథాలయం తాళాలు పగలగొట్టి…. అడ్డొచ్చిన వాచ్‌మెన్ ని బెదిరించి గ్రంథాలయాన్ని దోచుకున్నారు. గ్రంథాలయంలో దోచుకోవడానికి ఏముంది అనుకుంటున్నారా? ఇంకేముంది పాత పుస్తకాలు, చిత్తు కాగితాలతోపాటు… కుర్చీలు, ఫర్నిచర్, ఫ్యాన్లు ఎత్తుకెళ్లిపోయారు. దొంగలు చోరీకి గ్రంథాలయాన్నే ఎందుకు ఎంచుకున్నారో పోలీసులకు అర్థం కావడం లేదు. ఈ వెరైటీ దొంగతనంపై గ్రంథాలయం ఇన్చార్జి జయరాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిత్తు కాగితాలను దొంగిలించిన దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన గురించి తెలిసిన స్థానికులు నోరెళ్లబెడుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషంగా మారుతుందా ?? నిజమెంత ??

రీల్స్‌ పిచ్చి తో స్టంట్స్‌ చేసిన స్కూలు విద్యార్ధినిలు.. చివరికి ??

ఈ పండు కనబడితే అస్సలు వదలకండి.. తిన్నారంటే