Diamond Spectals Video: భారత మొఘల్ రాజుల వజ్రవైఢూర్యాల కళ్లద్దాలివి.! దీని విలువ వేలానికి..(వీడియో)
లండన్లోని సొతెబీ వేలం సంస్థ నిర్వహించిన ఆక్షన్లో.. వినూత్న అద్దాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ను ఏలిన 17వ శతాబ్దం నాటి మొఘలుల కళ్లద్దాలను వేలంలో ఉంచారు నిర్వహాకులు. అయితే ఈ కళ్ల జోడులో...
లండన్లోని సొతెబీ వేలం సంస్థ నిర్వహించిన ఆక్షన్లో.. వినూత్న అద్దాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ను ఏలిన 17వ శతాబ్దం నాటి మొఘలుల కళ్లద్దాలను వేలంలో ఉంచారు నిర్వహాకులు. అయితే ఈ కళ్ల జోడులో 200 క్యారెట్ల వజ్రాలు, 300 క్యారెట్ల ఎమరాల్డ్స్ వంటి వాటితో ఈ అద్దాలను తయారు అయ్యాయి. దీంతో ఈ గాగుల్స్ను కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఔత్సాహికులు.
దాదాపు 50 ఏళ్ల పాటు ఆ కళ్లజోడును ఓ వ్యక్తి వద్దే ఉన్నాయని సంస్థ అంటోంది. 200 క్యారెట్ల వజ్రాలు, 300 క్యారెట్ల ఎమరాల్డ్స్ తో ఈ అద్దాలను తయారు చేశారని చెప్పింది. అయితే అవి ఏ యువరాజు చేయించారో.. వాటి రూపశిల్పి ఎవరన్నది మాత్రం తెలియదని సంస్థ పేర్కొంది. కాగా, వేలానికి ముందు ప్రజల సందర్శనార్థం తొలిసారి ఈ నెల 7 నుంచి 11 వరకు హాంకాంగ్ లో ప్రదర్శించింది. ఇక తాజాగా లండన్లో ప్రదర్శిస్తోంది. అక్టోబర్ 26 వరకు ఆ ప్రదర్శన జరగనుంది. ఆ తర్వత మర్నాడే వేలం నిర్వహించనుంది. ఒక్కో దానికి సుమారు రూ.15.5 కోట్ల నుంచి రూ.25.8 కోట్ల దాకా వస్తుందని అంచనా వేస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

