Train Accident: అయ్యో.. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులు.. ఇంతలో దూసుకొచ్చిన రైలు
పంజాబ్లో రైలు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. పంజాబ్లోని కిరత్పూర్ సాహిబ్లో రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్నారు నలుగురు చిన్నారులు. ఇంతలో అదే ట్రాక్పై దూసుకొచ్చిన రైలు
పంజాబ్లో రైలు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. పంజాబ్లోని కిరత్పూర్ సాహిబ్లో రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్నారు నలుగురు చిన్నారులు. ఇంతలో అదే ట్రాక్పై దూసుకొచ్చిన రైలు చిన్నారులను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సట్లేజ్ నదిపై ఉన్న లొహంద్ రైల్వే బ్రిడ్జి సమీపంలో ఉన్న చెట్టనుంచి పండ్లు కోసుకునేందుకు వెళ్లారు చిన్నారులు. పండ్లు తెంపుకుని వచ్చి రైలు పట్టాలపై కూర్చుని తింటున్నారు. అదే సమయంలో సహరాన్పూర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్న రైలు అటుగా వచ్చింది. దానిని గమనించకుండానే ఆ చిన్నారులు తాము తెచ్చుకున్న పండ్లను తింటూ ఉండిపోయారు. దీంతో రైలు వారిని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారని పోలీసులు తెలిపారు. మరో చిన్నారి చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..