AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గబ్బిలాల పులుసు తింటూ ఎంజాయ్ చేసిన యువతి.. చివరకు ??

గబ్బిలాల పులుసు తింటూ ఎంజాయ్ చేసిన యువతి.. చివరకు ??

Phani CH
|

Updated on: Nov 15, 2022 | 9:57 AM

Share

ప్రపంచం మొత్తాన్ని ఇప్పటికే కరోనావైరస్ అతలాకుతలం చేసింది.. ఇంకా వ్యాప్తిచెందుతున్న పలు వేరియంట్లతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే..

ప్రపంచం మొత్తాన్ని ఇప్పటికే కరోనావైరస్ అతలాకుతలం చేసింది.. ఇంకా వ్యాప్తిచెందుతున్న పలు వేరియంట్లతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే.. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా గబ్బిలాల నుంచి జంతువులకు.. ఆ తర్వాత మానవుల్లోకి వ్యాపించి ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. గబ్బిలాలతో జగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు చేశాయి. అయినా.. ఆ ప్రమాదకర విషయాన్ని బేఖాతరు చేస్తూ థాయిలాండ్‌కు చెందిన ఓ యువతి.. వాటినే తింటూ ఎంజాయ్ చేసింది. చనిపోయిన గబ్బిలాలతో కూడిన బ్యాట్ సూప్‌ తాగుతూ.. వాటిని తుంచుకుని తింటూ, ఇది చాలా రుచిగా ఉందంటూ వర్ణించింది. ఆ వీడియోను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. గబ్బిలాల పులుసును తిన్న యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఫోంచనోక్ శ్రీసునక్లువా అనే యువతి ఇటీవల తన యూట్యూబ్‌ ఛానల్‌, ఫేస్‌బుక్‌లో.. ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. ఇంకేముంది ఇది తీవ్రంగా వైరల్ అయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడి రోడ్డుపై దూసుకుపోయిన విమానం !! చివరికి ఏమైందంటే ??

మంచుపై 14 కి.మీ నడిచివెళ్లిన బామ్మ !! ఎందుకో తెలుసా ??

మీరు కుక్కను పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త.. లేదంటే ఫైన్ కట్టాల్సిందే

తెలుగులో పాటలు పాడుతూ అదరగొడుతున్న విదేశీ వనిత !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం !! మద్యం డబ్బుల కోసం భార్యను అమ్మేసిన భర్త !!

 

Published on: Nov 15, 2022 09:57 AM