Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: దారుణం..! ఇలాంటి తల్లి కూడా ఉంటుందా.? పసికందుల్ని ఫ్రిడ్జ్‌లో దాచిన తల్లి..

Viral: దారుణం..! ఇలాంటి తల్లి కూడా ఉంటుందా.? పసికందుల్ని ఫ్రిడ్జ్‌లో దాచిన తల్లి..

Anil kumar poka

|

Updated on: Jul 02, 2023 | 8:44 AM

పిల్లలంటే ఇష్టపడని వారుండరు. అలాంటిది ఓ తల్లి మాత్రం తనకు పుట్టిన పిల్లలను కిరాతకంగా చంపింది. ఈ దారుణ ఘటన దక్షణి కొరియాలోని సువాల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.సువాన్ సిటీకి చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2018లో ఓ పాపకు జన్మనివ్వగా.. ఆ పసికందుని చంపి ఫ్రిజ్‌లో పెట్టింది.

సువాన్ సిటీకి చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2018లో ఓ పాపకు జన్మనివ్వగా.. ఆ పసికందుని చంపి ఫ్రిజ్‌లో పెట్టింది. 2019లో మరో పాప పుట్టినప్పుడు కూడా అంతే కఠినంగా వ్యవహరించింది. ఈ విషయాన్ని ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఆసుపత్రిలో ప్రసవాలు జరిగిన దాఖలాలు ఉండగా ఆమె తన పిల్లల పేర్లు నమోదు చేయకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో.. తొలుత ఆమె పోలీసుల విచారణకు సహకరించలేదు. ఫ్రిజ్‌లో రెండు మృతదేహాలు లభ్యం కాగా చివరికి తన పసిపిల్లలను చంపినట్లు ఆ మహిళ అంగీకరించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అలా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ మహిళ మాటలను విన్న ఆమె భర్త, అధికారులు, పోలీసులు అంతా షాక్ గురయ్యారు. ఈ హత్యల గురించి తనకు తెలియదని మహిళ భర్త తెలిపాడు. తన భార్య తనకు రెండుసార్లు అబార్షన్లు చేయించుకున్నట్లు చెప్పిందని అతను చెప్పాడు. చివరికి పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. 2022లో చనిపోయిన తమ శిశువు మృతదేహాన్ని మూడు సంవత్సరాల కంటైనర్‌లో దాచిపెట్టినందుకు దక్షిణ కొరియాలోని ఒక జంటను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..