Kakimada: 100 మిల్లి గ్రాముల బంగారం.. 3 గంటల సమయం.. సూక్ష్మ శివలింగం ఆవిష్కృతం
ఈ స్వర్ణకారుడు ఏకకాలంలో తన భక్తిని, ప్రతిభను ప్రదర్శించాడు. 100 మిల్లి గ్రాములు బంగారంతో 3 గంటల సమయంలో సూక్ష్మ శివలింగం తయారుచేసి ఆశ్చర్యపరిచాడు. డీటేల్స్ తెలుసుకుందాం పదండి....
కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన కోటేశ్వరరావు అనే స్వర్ణకారుడు 100 మిల్లి గ్రాములు బంగారంతో శివలింగాన్ని తయారు చేశాడు. కార్తీకమాసం సందర్భంగా ఈ సూక్ష్మ శివలింగ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి తనకు మూడు గంటల సమయం పట్టిందని వివరించాడు. తనకున్న కళా నైపుణ్యానికి భక్తిని జోడించి శివలింగాన్ని తీర్చిదిద్దాడు. అతి చిన్న సైజులో, శివలింగం, దానిపై నాగ సర్పం ఎంతో నేర్పుగా తీర్చిదిద్ది తన కళానైపుణ్యాన్ని చాటుకున్నాడు.
ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ.. శివలింగం తయారీకి తనకు మూడు గంటల సమయం పట్టిందని తెలిపాడు. మూడు సంవత్సరాలుగా, తన మనసులో రూపుదిద్దుకున్న కల, ఈ ఏడాది కార్తీకమాసంలో నెరవేరిందని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేసాడు.స్వర్ణకార సంఘ సభ్యులు నాయకులు కోటేశ్వరరావు నైపుణ్యాన్ని కొనియాడుతూ అభినందనలు తెలియజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

