నుమాయిష్ ఎగ్జిబిషన్ రైడ్లో తలకిందులుగా.. తర్వాత ఏమైందంటే..
నాంపల్లిలోని నుమాయిష్లో రేంజర్ రైడ్ మొరాయించి జనాలను షాక్కు గురిచేసింది. అమ్యూజ్మెంట్ పార్క్లో రైడ్ ఆగిపోవడంతో అందులో ఉన్న జనాలకు ఊపిరి ఆగినంత పనైంది. రన్నింగ్లో ఉండగానే రేంజర్ రైడ్ ఉన్నపళంగా నిలిచిపోయింది. ప్రయాణికులు దాదాపు 15 నిమిషాలు అలా గాల్లో తలక్రిందులుగా ఉండిపోయారు.
దీంతో వారికి చెమటలు పట్టేశాయి. ప్రాణాలతో సేఫ్గా బయటపడుతామా అని వారంతా హడలిపోయారు. బేరింగ్లు మరమ్మతుకు రావడంతోనే రేంజర్ నిలిచిపోయిందంటున్నారు. నిర్వాహకులు, పోలీసులు అందులో ఉన్న వారిని సురక్షితంగా కిందకు దించారు. లక్కీగా అంతా సేఫ్గానే బయటపడ్డారు. ప్రతీ రోజు నుమాయిష్ను కొన్ని వేల మంది సందర్శిస్తుంటారు. ఎగ్జిబిషన్లో ఉండే ఇలాంటివి ఎక్కి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ ఘటనతో జాలీ రైడ్స్ ఫిట్నెస్పైన, సేఫ్టీపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సరదా సరే.. తేడా వస్తే గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయ్.. అందుకే సేఫ్టీపై మరింత శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు.
వైరల్ వీడియోలు
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
