Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 లక్షలమందిని ఇంప్రెస్‌ చేసిన దోశ.. తింటే వదలరు

30 లక్షలమందిని ఇంప్రెస్‌ చేసిన దోశ.. తింటే వదలరు

Phani CH

|

Updated on: Jun 03, 2023 | 9:44 PM

చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వాటిలో కొన్ని బాగా వైరల్‌ అవుతాయి.. నెటిజన్ల మనసు దోచుకుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వాటిలో కొన్ని బాగా వైరల్‌ అవుతాయి.. నెటిజన్ల మనసు దోచుకుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో ఓ మహిళ నేలపై వేయాల్సిన ముగ్గును అట్ల పెనంపై వేసి నెటిజన్ల మనసు దోచుకున్నారు. ఆమె దోశ పెనంపైన దోశ పిండితో ముగ్గు పెట్టింది. చకచకా చుక్కలు పెట్టి అందమైన ముగ్గు వేసి, దానిచుట్టూ నూనెవేసి చక్కగా కాలిన తర్వాత సర్వ్‌ చేయడానికి రెడీ చేసింది. ఈ వీడియోలో ఆమె చేయి తప్ప ముఖం కనిపించలేదు కానీ అందుకు సంబంధించిన వీడియో మాత్రం నెటిజన్లను కళ్లు తిప్పుకోనివ్వడంలేదు. అలాగే వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. దీనికి ముగ్గుల దోశ అని పేరు పెట్టారు నెటిజన్లు. ఇంకా కొందరు కలర్స్ వేయడం మర్చిపోయారని, గొబ్బెమ్మ కూడా పెడితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోను 30 లక్షలమందికి పైగా వీక్షించారు. 60 వేలమంది లైక్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యవ్వనం కోసం కోట్లు ఖర్చుచేయక్కర్లేదు.. కేవలం ఈ గదిలోకి వెళ్తే చాలు

35 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడపిల్ల.. ఆనందంతో తండ్రి..

Ram Charan: శర్వానంద్ పెళ్లి వేడుకల్లో రామ్‌ చరణ్‌ హంగామా..

ఘుమఘుమలు సరే.. బిర్యానీతో బరువు తగ్గుతారని తెలుసా ??

TOP 9 ET News: హాలీవుడ్‌ను తాకిన గుంటూరు కారం | శర్వా పెళ్లిలో.. రామ్‌ చరణ్ హంగామా