పెళ్లి మండపం లోకి పాము వచ్చింది.. ఆ తర్వాత ఏమైంది ??
ఆలయంలోని కళ్యాణ మండపంలో వివాహం జరగుతోంది. అందరూ పెళ్లి హడావిడిలో ఉన్నారు. ఇంతలో జనంలో అలికిడి మొదలైంది. ఏం జరిగిందా అని చూడగా అక్కడ గోడ పక్కగా ఓ భారీ కొండచిలువ పడుకొని ఉంది. అది చూసి పెళ్ళికొచ్చినవారంతా భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు. కొందరు స్నేక్ క్యాచర్కి సమాచారం ఇచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పంచాయతన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి ఓ కొండచిలువ హల్చల్ చేసింది. గోదావరి ఒడ్డున సుబ్రహ్మణ్య స్నాన ఘాట్లో శివాలయం ఉంది. ఆలయం పై అంతస్తులో ఓ కళ్యాణమండపం, వేదిక ఉన్నాయి. బుధవారం రాత్రి ఆ వేదికలో ఓ వివాహం జరుగుతుండగా గోడ ప్రక్కన ఏదో మెరుస్తున్నట్లు అక్కడున్న స్థానికులు చూశారు. దగ్గరకు వెళ్లి పరిశీలించగా సుమారు 7 అడుగులు పొడవున్న ఉన్న ఓ కొండచిలువ కనిపించింది. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపంలో ఉన్న అందరూ పరుగులు తీశారు. వెంటనే అక్కడున్న కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన అక్కడకు వచ్చారు. ఓ పక్క పెళ్లి భాజాలు,అందరూ గుమిగూడటంతో ఆ కొండచిలువ కాసేపు ఎటూ కదలకుండా ఉండిపోయింది. ఇటీవల వచ్చిన వరదలకు గోదావరి నుండి ఈ కొండచిలువ కొట్టుకు వచ్చిందని స్థానికులు భావిస్తున్నారు. దీంతో అక్కడున్న ఆలయ సిబ్బంది అటవీ శాఖకు, స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ కొండచిలువను బంధించి తీసుకెళ్లారు. దానిని సురక్షితంగా అటవీప్రాంతంలో వదిలిపెడతామని తెలిపారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంబులెన్స్లో భారీ పేలుడు.. లోపల నిండు గర్భిణీ..
తులసీ గబ్బార్డ్ నియామకం.. పాకిస్థాన్ను భయపెడుతుంటే.. భారత్ను సంతోషపెడుతోందా ??
Obesity: ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే.. మన శరీరంలో కొవ్వు పెరుగుతుంది
ఏపీలో వర్షాలు !! ఎప్పటి వరకు అంటే ??
మహిళల అత్యాచారాలపై అసెంబ్లీలో అనిత ఫైర్.. వైసీపీ ఎమ్మెల్సీలకు మాస్ వార్నింగ్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

