కవలల్లో ఒకరు మృతి.. రెండో బిడ్డను తల్లి కడుపులోనే ఉంచి..

కృత్రిమ పద్ధతుల్లో గర్భం దాల్చిన మహిళకు కవలల ప్రసవంలో ఎదురైన సమస్యను డాక్టర్లు పరిష్కరించారు. ఒడిశాలోని కెందుపాట్నాకు చెందిన పార్వతి బెవురా ఐవీఎఫ్‌ పద్ధతిలో గర్భం దాల్చారు.

కవలల్లో ఒకరు మృతి.. రెండో బిడ్డను తల్లి కడుపులోనే ఉంచి..

|

Updated on: Jan 19, 2023 | 9:44 AM

కృత్రిమ పద్ధతుల్లో గర్భం దాల్చిన మహిళకు కవలల ప్రసవంలో ఎదురైన సమస్యను డాక్టర్లు పరిష్కరించారు. ఒడిశాలోని కెందుపాట్నాకు చెందిన పార్వతి బెవురా ఐవీఎఫ్‌ పద్ధతిలో గర్భం దాల్చారు. నొప్పులు రావడంతో గతేడాది అక్టోబరులో కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు కవలల్లో ఒక శిశువు మృతి చెందడంతో తొలగించారు.రెండో శిశువుకు ప్రసవం చేస్తే ఇదే పరిస్థితి ఎదురవుతుందని భావించిన డాక్టర్లు.. ప్రసవం చేయకుండా బిడ్డను తల్లి కడుపులోనే ఉంచి బరువు పెరిగిన తరువాత డెలివరీ చేయాలని నిర్ణయించారు. పార్వతి మధుమేహం, థైరాయిడ్‌ వంటి సమస్యలతో బాధపడుతుండటంతో 52 రోజులపాటు తల్లీబిడ్డను 24 గంటలూ పర్యవేక్షణలో ఉంచి అవసరమైన చికిత్స అందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బీచ్‌లో సముద్ర పాములు.. చనిపోయినట్లుగా భ్రమించి కాటేస్తాయి..

అరె ఏంట్రా ఇదీ.. నెటిజన్లను ఇలా మోసం చేస్తున్నారా..

TOP 9 ET News: ఒక్క ట్వీట్‌తో అందరి నోళ్లు మూయించారు | జక్కన్న సక్సెస్‌ పై బాలీవుడ్‌ డాక్యూమెంటరీ

ప్రశాంత్ నీల్, దిల్ రాజు కాంబోలో రామ్‌ చరణ్ ‘రవణం’

ఏందీ నీ గోల !! ట్రాక్ తప్పుతున్న హైపర్ ఆది !!

 

Follow us