AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేచర్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. మన్యంలో ఆ రెండు బంద్ !!

నేచర్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. మన్యంలో ఆ రెండు బంద్ !!

Phani CH

|

Updated on: Jun 05, 2023 | 9:50 AM

చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు. దట్టమైన అడవిలో డెబ్బై ఫీట్ల ఎత్తులో నుండి పరవళ్ళు తొక్కుతున్న పాలధారాల్లాంటి జంట జలపాతాలు. ఆహ్లాదం, ఆకట్టుకునే పచ్చదనం, ఎంతో ప్రశాంతత లభిస్తుంది అక్కడ. పిల్లల పార్కులు, అడ్వెంచర్‌ జోన్‌లు, వంతెనలు... ఇలాంటి ఎన్నో విశేషాలతో..

చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు. దట్టమైన అడవిలో డెబ్బై ఫీట్ల ఎత్తులో నుండి పరవళ్ళు తొక్కుతున్న పాలధారాల్లాంటి జంట జలపాతాలు. ఆహ్లాదం, ఆకట్టుకునే పచ్చదనం, ఎంతో ప్రశాంతత లభిస్తుంది అక్కడ. పిల్లల పార్కులు, అడ్వెంచర్‌ జోన్‌లు, వంతెనలు… ఇలాంటి ఎన్నో విశేషాలతో కనువిందు చేస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతం. ఇక్కడి ప్రకృతి సోయగాలు టూరిస్టులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంటాయి. అలాంటి మన్యం పర్యాటక ప్రాంతాల్లోని రెండు జలపాతాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. మన్యం ప్రాంతంలో పాములేరు వాగు… సీతపల్లి వాగు,జడేరు వాగు, పింజర వాగు, జల తరంగిణి దగ్గర ఎక్కువగా పర్యాటకుల సందడి కనిపిస్తుంది. కానీ.. రక్షణ చర్యలు తీసుకోవాల్సిన సిబ్బంది… పర్యాటకుల నుంచి టిక్కెట్లు కొనిపించి డబ్బు దండుకోవడంతోనే సరిపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల అమృతదార జలపాతం వద్ద చెట్టుకొమ్మ పడి యువతి మృతి చెందింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందాల పోటీలో షాకింగ్ ఘటన !! స్టేజ్‌పై “నా భార్య అందగత్తె కాదా” అంటూ భర్త వీరంగం

Guntur Karam: గుంటూరు కారంలో మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా ??

రైల్వే బాధితుల పరిహారంపై సోనూ సంచలన వ్యాఖ్యలు

Sunitha: ‘నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం అంటే ఎలా’.. సునీత ఎమోషనల్..