Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే బాధితుల పరిహారంపై సోనూ సంచలన వ్యాఖ్యలు

రైల్వే బాధితుల పరిహారంపై సోనూ సంచలన వ్యాఖ్యలు

Phani CH

|

Updated on: Jun 05, 2023 | 9:46 AM

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దుర్ఘటనపై పలువురు నటీనటులు కూడా స్పందిస్తున్నారు

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దుర్ఘటనపై పలువురు నటీనటులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా నటుడు సోనూ సూద్ కూడా దారుణ ఘటనపై స్పందించారు. బాధితులకు సహాయం చేయడంలో తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. సోనూసూద్ బాధితుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రస్తుతం బాధితులకు ఇస్తున్న పరిహారం 3-4 నెలల్లో అయిపోతుంది. మనం ట్వీట్ చేస్తాము, సంతాపాన్ని తెలియజేస్తాము.. తర్వాత ఎవరి జీవితంలో వారు బిజీగా మారిపోతాం.. మరి నెక్స్ట్ బాధితుల కుటుంబం పరిస్థితి ఏమిటి? వారి జీవనోపాధి ఏమిటి అంటూ ప్రశ్నించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sunitha: ‘నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం అంటే ఎలా’.. సునీత ఎమోషనల్..