AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివయ్య కోసం వందల సంఖ్యలో తరలి వచ్చిన పాములు.. హర హర మహాదేవ..

శివయ్య కోసం వందల సంఖ్యలో తరలి వచ్చిన పాములు.. హర హర మహాదేవ..

Phani CH
|

Updated on: Nov 21, 2025 | 12:24 PM

Share

కృష్ణా జిల్లా నాగాయలంక రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తిక మాసంలో వందలాది నీటి పాములు గుంపులు గుంపులుగా దర్శనమిచ్చాయి. కృష్ణా నది ప్రవాహంలో ఈ అద్భుత దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రతి ఏటా కనిపించినా, ఈసారి భారీ సంఖ్యలో రావడంతో శివుడి అనుగ్రహంగా భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కృష్ణా జిల్లా నాగాయలంకలో ఓ అరుదైన సంఘటన జరిగింది. పవిత్ర కార్తిక మాసంలో స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపానికి వందలాది నీటి పాములు తరలివచ్చాయి. ఆలయ పరిసరాల్లోని కృష్ణా నది ప్రవాహంలో పాములు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ పురాతన శివాలయం వద్ద ప్రతి ఏటా కార్తిక మాసంలో పాములు కనిపిస్తాయని స్థానికులు తెలిపారు. అయితే, ఈసారి వాటి సంఖ్య వందల్లో ఉండటంతో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయం వెనుక ఉన్న నదీ ప్రవాహంలో ఈ పాములు స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించాయి. ఇదంతా శివయ్య మహిమేనని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ ఘటనపై ఓ భక్తుడు స్పందిస్తూ..ప్రతి కార్తిక మాసంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ పాములు వస్తాయి. ఈసారి మరింత ఎక్కువ సంఖ్యలో రావడం శివుడి అనుగ్రహానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ఈ అద్భుత దృశ్యాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయానికి పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఆలయం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాయంత్రానికి మరిన్ని పాములు వచ్చే అవకాశం ఉందని స్థానికులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బర్గర్ తిని వ్యక్తి మృతి.. ఏం తినాలన్న భామేస్తుందిరా అయ్యా..

ఒక ‘పిల్లి’.. ఆ నగరాన్నే కదిలించింది..

ఉద్యోగులపై నిఘా !! 5 నిమిషాల పాటు మౌస్‌ ను ముట్టుకోకుంటే !!

కళకు హద్దుల్లేవ్.. నా మనసులో ద్వేషం లేదు