Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడవిలో భారీ మనిషి ఆకారం.. దగ్గరకెళ్లి చూడగా

అడవిలో భారీ మనిషి ఆకారం.. దగ్గరకెళ్లి చూడగా

Phani CH
|

Updated on: Jun 27, 2025 | 7:52 PM

Share

ములుగు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మందగడ్డ అటవీ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. పెద్ద సైజులో మనిషి బొమ్మ వేసి, దానిమీద పసుపు, కుంకుమతో ముగ్గు వేశారు. అంతేకాదు.. జంతువులను బలిచ్చి, ఆ బొమ్మ మీద నెత్తురు ఒలికించారు. ఆ ముగ్గులో నాలుగు కాళ్ల జంతువుల పాదముద్రలు కనిపించటంతో, ఏదో పెద్ద పూజే చేశారని, దీనివల్ల ఎవరికి ఎలాంటి ఆపద రాబోతోందో అని అక్కడి స్థానికులు గడగడ వణికి పోతున్నారు.

కాగా, అక్కడి ఆధారాలను బట్టి ఆదివారం అర్ధరాత్రి ఈ క్షుద్ర పూజలు నిర్వహించించి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. గిట్టని వారిని భయపెట్టటానికి లేదా అడ్డుతొలగించుకోవటం కోసం ఈ పూజ చేశారా? లేక ఎవరైనా అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందటం కోసం ఈ పూజలు చేయించారా? అనే కోణంలో స్థానికులు చర్చించుకుంటున్నారు. అసలు.. ఈ పూజలు ఎవరు చేశారు? గ్రామంలోని వారేనా? లేక ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు తమ ప్రాంతానికి వచ్చి పూజలు నిర్వహించారా? అని కూడా జనం ఆరా తీస్తున్నారు. కాగా, తమ ప్రాంతంలో జరిగిన ఈ క్షుద్రపూజల గురించి పోలీసులకు సమాచారం అందించిన గ్రామస్తులు, వాటి వెనక ఉన్న వ్యక్తుల ఆరా తీయాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొలనులో కొండచిలువ.. అది కక్కింది చూసి జనం షాక్‌

గ్యాస్‌ సిలిండర్ల సరఫరా ఆగిపోనుందా.. కారణం అదేనా ??

ఎలక్ట్రిక్‌ విమానం వచ్చేసింది.. ఒక్కసారి చార్జి చేస్తే.. 463 కి.మీ

ధోనీ ఫ్యాన్‌ అంటూ తమన్ ను ఎద్దేవా చేసిన నెటిజన్.. ‘నీ అడ్రస్ చెప్పు..’ తమన్ మాస్ వార్నింగ్

Chiranjeevi: చాలా దారుణం..! అమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా కనిపిస్తుంటే ఇలాంటి వార్తలా ??