కొలనులో కొండచిలువ.. అది కక్కింది చూసి జనం షాక్
రుతుపవనాల ఎఫెక్ట్తో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, చెరువులు కుంటలు నిండుకుండల్లా మారుతున్నాయి. దీంతో, వేసవి తాపంతో అల్లాడిపోయిన.. పాములు, కొండచిలువలు చెరువులు,కుంటలు, పొలాలలో తిరుగుతూ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా, వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలోని అవుసుల కుంట చెరువులో ఆదివారం 13 అడుగుల పొడవున్న ఒక భారీ కొండచిలువ కలకలం సృష్టించింది.
కాగా, దీనిని గమనించిన స్థానికులు స్నేక్ క్యాచర్కి సమాచారమివ్వగా, వారి బృందం కొండచిలువను బంధించింది. అయితే, పట్టుబడిన కొండచిలువను బయటకు తీసుకురాగానే, అది అప్పటికే ఉడుమును కక్కేసింది. ఆ ఉడుము పొడవు.. 5 అడుగల పొడవు ఉండటంతో అది చూసిన జనం ఒక్కసారి షాక్ తిన్నారు. ఈ సందర్భంగా, స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్ మాట్లాడుతూ.. వానాకాలంలో చిన్న పిల్లలు.. ఒంటరిగా చెరువు వైపు వెళ్లకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విషసర్పాలు, అటవీ జంతువులతో జాగ్రత్తగా ఉండాలన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగిపోనుందా.. కారణం అదేనా ??
ఎలక్ట్రిక్ విమానం వచ్చేసింది.. ఒక్కసారి చార్జి చేస్తే.. 463 కి.మీ
ధోనీ ఫ్యాన్ అంటూ తమన్ ను ఎద్దేవా చేసిన నెటిజన్.. ‘నీ అడ్రస్ చెప్పు..’ తమన్ మాస్ వార్నింగ్
Chiranjeevi: చాలా దారుణం..! అమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా కనిపిస్తుంటే ఇలాంటి వార్తలా ??
అతడిపై ప్రేమ లేదంటూనే.. ప్రేమపై తమన్నాకు ఇండైరెక్ట్ పంచ్
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..

