AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆటలాడిన కొండముచ్చు

విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆటలాడిన కొండముచ్చు

Phani CH
|

Updated on: Jan 25, 2024 | 9:42 PM

Share

ఓ కొండముచ్చు చేసిన వింత పనులు చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అంతకు మించి ఆనందపడ్డారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిందీ ఘటన. స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలోకి వచ్చిన కొండముచ్చు విద్యార్థులతో కలిసి ఆటలాడింది.. వారితో కలిసి భోజనం కూడా చేసింది. అంతేకాక ఆ కొండముచ్చు అక్కడే ఉన్న ఓ వాహనంపైకి ఎక్కి అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోయింది. ఈ దృశ్యాలు స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.

ఓ కొండముచ్చు చేసిన వింత పనులు చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అంతకు మించి ఆనందపడ్డారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిందీ ఘటన. స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలోకి వచ్చిన కొండముచ్చు విద్యార్థులతో కలిసి ఆటలాడింది.. వారితో కలిసి భోజనం కూడా చేసింది. అంతేకాక ఆ కొండముచ్చు అక్కడే ఉన్న ఓ వాహనంపైకి ఎక్కి అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోయింది. ఈ దృశ్యాలు స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అక్కడే ఉన్న కొందరు ఆ కొండముచ్చు చేసిన చిలిపి చేష్టలను తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీయడంతో అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. మధ్యాహ్నం సమయంలో జంగారెడ్డిగూడెం హై స్కూల్ దగ్గరకు ఓ కొండముచ్చు వచ్చింది. ఆ సమయంలో విద్యార్థులు భోజనం చేస్తున్నారు. అయితే ఆ కొండముచ్చు భోజనం చేస్తున్న విద్యార్థుల దగ్గరకు వెళ్లి కూర్చుంది. ఓ విద్యార్థి తన పళ్లెంలోని ఆహారాన్ని కొండముచ్చుకు పెట్టాడు. తొలుత ఆహారం రుచి చూసింది. బాగుందనిపించిందో ఏమో విద్యార్థితో కలిసి తాను కూడా అదే పళ్లెంలో తినడం ప్రారంభించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aadhaar Cards: నీట్లో కొట్టుకొస్తున్న ఆధార్ కార్డులు.. జిల్లా కలెక్టర్ సీరియస్

బాలరాముడికి 101 కిలోల బంగారం విరాళం.. ఎవరిచ్చారో తెలుసా ??

62 ఏళ్లుగా కంటిమీద కునుకే వేయని వ్యక్తి !! ఆశ్చర్యపోతున్న వైద్యశాస్త్రవేత్తలు

రామజన్మభూమి ట్రస్ట్‌కు అంబానీ భారీ విరాళం

ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు !! 65 ఏళ్లల్లో కోటి కేరట్ల వెలికితీత