AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారంపై ఇన్వెస్ట్‌ చేసేవారికి అలెర్ట్‌

బంగారంపై ఇన్వెస్ట్‌ చేసేవారికి అలెర్ట్‌

Samatha J
|

Updated on: Jan 18, 2026 | 12:39 PM

Share

బంగారంపై పెట్టుబడులు పెరిగినప్పటికీ, పన్నుల గురించి అవగాహన లేకపోతే రాబడిలో 30-50% నష్టపోవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ బంగారం, భౌతిక బంగారం వంటి వివిధ పెట్టుబడి మార్గాలపై పన్ను నిబంధనలు వేరుగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవడం ద్వారా గరిష్ట రాబడి పొందవచ్చు.

బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో, గతేడాది సుమారు 80% రాబడిని అందించింది. దీంతో అనేక మంది బంగారంపై తమ పెట్టుబడులను పెంచుకుంటున్నారు. అయితే, బంగారంపై పెట్టుబడుల విషయంలో సరైన అవగాహన లేకపోతే పన్నుల రూపంలో 30 నుంచి 50 శాతం వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. బంగారంపై పెట్టుబడి అంటే కేవలం నగలు లేదా నాణేలు కొనడం మాత్రమే కాదు. ప్రస్తుతం బంగారు ఈటీఎఫ్‌లు, డిజిటల్ బంగారం, సావరిన్ గోల్డ్ బాండ్లు వంటి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రతి పెట్టుబడి మార్గానికి దాని స్వంత పన్ను నిబంధనలు ఉన్నాయి. ఉదాహరణకు, సావరిన్ గోల్డ్ బాండ్లు మెచ్యూరిటీ తర్వాత పన్ను రహితంగా ఉంటాయి, కానీ వార్షిక వడ్డీపై పన్ను వర్తిస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్‌లో 12 లేదా 24 నెలల తర్వాత విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (20%) వర్తిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం :

సీఎంను చిప్స్‌ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్‌ ఇదే!

అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!

ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంటే..

కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!