నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
అతి ఎప్పుడూ అనర్ధానికి దారితీస్తుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. విషయం ఏదైనా అతి ఎప్పుడూ పనిచేయదు. కొందరు తమను తాము నిరూపించుకోడానికి అతిగా ప్రవర్తిస్తుంటారు. అదే వారిపాలిట శాపంగా మారుతుంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ వ్యక్తి ఓ పెద్ద నాగుపామును పట్టుకున్నాడు. దానిని ఎక్కడో సురక్షితంగా వదలిపెట్టాల్సింది పోయి దాంతో ఆటలాడాడు. చివరికి అది అతన్ని కాటేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్లో రోడ్డుకు ఇరువైపులా పంటపొలాలు ఉన్నాయి. అక్కడ పొలం గట్టుపైన రాజాసింగ్ అనే వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో ఓ ఆరడుగుల నాగుపాము ఉంది. అతని చేతిలో భారీ నాగుపామును చూసి స్థానికులు కంగారు పడ్డారు. పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దానిని వదిలిపెట్టాలని రాజాసింగ్కి చెప్పారు. అయినా అతను వినిపించుకోకుండా తన ధైర్యాన్ని వాళ్లముందు ప్రదర్శించాలనుకున్నాడు. దీంతో ఆ పామును అటూ ఇటూ తిప్పుతూ.. తలపైకి ఎత్తుకుంటూ విన్యాసాలు చేశాడు. స్థానికులు ఎంత చెప్పినా వినకుండా అతిగా ప్రవర్తించాడు. పామును భుజాలపై వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసాడు. ఈ క్రమంలో ఆ పాము అతడిని కాటు వేసింది. ఏకంగా మూడు సార్లు పాము కాటువేసింది. దాంతో రాజాసింగ్ పరిస్థితి విషమించింది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే విష ప్రభావంతో అప్పటికే రాజాసింగ్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు. ఇది ధైర్యం కాదు..మూర్ఖత్వం అని ఒకరు, దీనినే చావును కోరి కౌగిలించుకోవడం అంటారని మరొకరు వ్యాఖ్యానించారు.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

