Viral: 4 మామిడి పళ్లు.. రూ.10 లక్షలు కానీ ఏం లాభం..? దొంగలు కొట్టేశారు..
అత్యంత ఖరీదైన రకం మామిడి పండ్లను పండించిన ఓ రైతు కళ్ళల్లో ఆనందం క్షణాల్లో ఆవిరైంది. అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.2.5 లక్షల ధర పలికే రకం మామిడి పండ్లను ఒడిశాలోని నౌపడాలోని లక్ష్మీనారాయణ అనే రైతు పండించాడు. అతడి తోటలో సుమారు 38 రకాల మామిడి పండ్ల చెట్లను పెంచుతున్నాడు.
అత్యంత ఖరీదైన రకం మామిడి పండ్లను పండించిన ఓ రైతు కళ్ళల్లో ఆనందం క్షణాల్లో ఆవిరైంది. అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.2.5 లక్షల ధర పలికే రకం మామిడి పండ్లను ఒడిశాలోని నౌపడాలోని లక్ష్మీనారాయణ అనే రైతు పండించాడు. అతడి తోటలో సుమారు 38 రకాల మామిడి పండ్ల చెట్లను పెంచుతున్నాడు. ఇందులో ఒక రకం భారీ ధర పలుకుతోందని తెలియగానే సంతోషం పట్టలేకపోయాడు. సోషల్ మీడియా వేదికల్లో.. ఈ సమాచారంతో మామిడి పండ్ల చెట్ల ఫొటోలను పోస్ట్ చేసాడు. ఫొటోలు ఆన్లైన్లో పోస్టు చేసిన ఒక్క రోజులోనే అతడి తోటలో నాలుగు మామిడి పండ్లు దొంగతనానికి గురయ్యాయి. ఈ విషయాన్ని అతడు నమ్మలేకపోయాడు. ఈ ఘటన తర్వాత రైతులు పండించే విలువైన ఉత్పత్తులకు రక్షణపై ఆందోళన మొదలైంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కి చెందిన సంకల్ప్ పరిహార్ కూడా అత్యంత ఖరీదైన జపాన్కు చెందిన మియజాకీ రకం మామిడి పండించాడు. అది తెలిసి ఆ పండ్లకోసం తోటలో దొంగలు కూడా పడ్డారట. దాంతో గతేడాది ఆ చెట్ల కాపలాకి ప్రత్యేకంగా నలుగురు గార్డుల్ని నియమించుకుని, ఆరు వేట కుక్కల్నీ పెంచాల్సి వచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్కు వచ్చి.. ఆర్టిస్ట్కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

