AP news: చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి ఒక్కసారిగా తన్మయత్వం.. వీడియో.
కాకినాడ జిల్లా.. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు ప్రాంతంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. అచ్చం దశావతారం సినిమా సీన్ రిపీట్ అయింది.
కాకినాడ జిల్లా.. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు ప్రాంతంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. అచ్చం దశావతారం సినిమా సీన్ రిపీట్ అయింది. ఆ సినిమాలో విష్ణుమూర్తి విగ్రహం ఏ విధంగా ఒడ్డుకు కొట్టుకొచ్చిందో అదే విధంగా.. కడలి నుంచి అయ్యప్ప స్వామి విగ్రహం ఉద్భవించింది. నవంబరు 14 సాయంత్రం చేపల వేటకు వెళ్లిన సూరాడ శివ అనే మత్స్యకారుడు వలలో అయ్యప్ప స్వామి విగ్రహం ప్రత్యక్షమైంది. చేపల కోసం వేసిన వల బరువుగా అనిపించడంతో.. దాన్ని లాగిన మత్స్యకారుడు.. లోపల అయ్యప్ప విగ్రహం ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. తోటి మత్స్యకారుల సహాయంతో ఒడ్డుకి చేర్చాడు. ఆపై విగ్రహాన్ని సుబ్బంపేట రామాలయాలని తీసుకెళ్లారు.విషయం తెలియడంతో అక్కడికి స్థానికులు పోటెత్తుతున్నారు. రాతితో చెక్కబడి.. చెక్కుచెదరని సుందర రూపంతో ఉన్న మణికంఠుని చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలలోని అయ్యప్ప స్వామి భక్తులకు తెలియడంతో ఒక్కొక్కరిగా చేరుకుని పూజలు చేస్తున్నారు. కడలి నుంచి తమ వల ద్వారా ఒడ్డుకు చేరిన అయ్యప్ప విగ్రహానికి గుడి కట్టే ఆలోచనలో ఉన్నారు స్ధానిక మత్స్యకారులు. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు మాలలు ధరించే సమయం. అందునా అయ్యప్ప విగ్రహాన్ని ఎవ్వరూ నిమజ్జనం చేయరు. దీంతో ఆ అయ్యప్ప విగ్రహం ఎక్కడి నుంచి కొట్టుకువచ్చిందో అర్థం కావడం లేదు. ఇది హరిహర పుత్రుడి మహత్యమే అంటున్నారు భక్తులు. శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అంటూ తన్మయత్వానికి లోనవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

