ఉదయాన్నే గుడికి వచ్చిన అర్చకుడు..ఆ సీన్ చూసి షాక్ వీడియో
ఉమ్మడి కర్నూలు జిల్లా శివ క్షేత్రాల్లో శ్రీశైలం తర్వాత అత్యంత కీలకమైన ఆలయం కాళ హస్తి రామేశ్వరస్వామి గుడి. దశాబ్దాల నాటి ఈ ఆలయంలోని ఐదు హుండీలను దొంగలు చోరీ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆలయంలో మొత్తం ఎనిమిది హుండీలు ఉండగా వాటిలో ఐదు చిన్నవి, మూడు పెద్దవి అని ఆలయ సిబ్బంది తెలిపారు. కాగా దొంగలు ఐదు చిన్న హుండీలను టార్గెట్ చేశారు. ఆలయ అర్చకులు జూలై 13వ తేదీన స్వామివారి కైంకర్యాల కోసం ఆలయానికి రాగా అప్పటికే తలుపులు తెరిచి ఉండటంతో వెంటనే ఈవోకి సమాచారం అందించారు. దీంతో అందరూ కలిసి ఆలయంలోకి వెళ్లి చూడగా హుండీలు కనిపించకుండా పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా అర్ధరాత్రి 1 గంట టైంలో ఇద్దరు మాస్కులు వేసుకున్న వ్యక్తులు మెయిన్ గాటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీలను అపహరించినట్లుగా స్పష్టమైంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు పక్కన కాలువలో హుండీలను పగలగొట్టి అందులో చిల్లర నాణాలను వదిలేసి నోట్ల కరెన్సీని దొంగలు దోచుకెళ్లారు.
గ్యాస్ సెగ.. మళ్లీ లాక్డౌన్ తప్పదా
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న అధికారి
ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ
చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు
కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ

