AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి

రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి

Phani CH
|

Updated on: Nov 05, 2024 | 7:27 PM

Share

భారతీయ రైల్వేకు ఓ వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. అపరిశుభ్ర టాయిలెట్, సరిగా పనిచేయని ఏసీ కారణంగా ఇబ్బంది ఎదుర్కొన్న ప్రయాణికుడికి రూ.25 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. న్యాయ ఖర్చుల కింద బాధిత కస్టమర్‌కు మరో రూ.5 వేలు ఇవ్వాలని తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే, వైజాగ్‌కు చెందినవి.

మూర్తి ఇటీవల తిరుపతి నుంచి దువ్వాడ‌కు రైల్లో వెళుతూ వసతుల లేమి కారణంగా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. తొలుత తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైల్లో నాలుగు 3ఏసీ టిక్కెట్లు బుక్ చేసుకోగా వారికి బీ-7 కోచ్‌లో బెర్తులను కేటాయించారు. ఆ తరువాత వారిని 3ఏ నుంచి 3ఈకి మారుస్తున్నట్టు రైల్వే నుంచి మెసేజ్ అందింది. ఇక జూన్ 5న మూర్తి తన కుటుంబంతో కలిసి రైల్లో బయలుదేరారు. జర్నీలో ఉండగా బోగీలోని టాయిలెట్‌లో కనీసం నీరు కూడా లేకపోవడంతో వారు ఇబ్బంది పడ్డారు. బోగీలో ఏసీ కూడా పనిచేయకపోవడం తీవ్ర అసంతృప్తి కలిగించింది. బోగీ మొత్తం అపరిశుభ్రంగా ఉంది. దీంతో, ఆయన దువ్వాడలో సంబంధిత అధికారికి ఫిర్యాదు చేశారు. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. అయితే , మూర్తి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రైల్వే చెప్పుకొచ్చింది. పరిహారం రూపంలో ప్రజాధనం కోసం ఈ కేసు వేసినట్టు ఉందని చెప్పుకొచ్చింది. రైల్వే కల్పించిన వసతులతో వారు ప్రయాణం పూర్తి చేసినట్టు వాదించింది. కానీ, వైజాగ్ జిల్లా కన్జూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్‌ కమిషన్ మాత్రం రైల్వే వాదనను తిరస్కరించింది. టిక్కెట్టు కొనుక్కున్న వినియోగదారులకు సక్రమంగా పనిచేసే టాయిలెట్, ఏసీ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత రైల్వేకు ఉందని స్పష్టం చేసింది. మూర్తి ఫిర్యాదు తరువాత రైల్వే సిబ్బందిని పంపించి టాయిలెట్ సమస్యను పరిష్కరించిన విషయాన్ని అంగీకరించింది. అయితే, కనీస తనిఖీలు లేకుండా దక్షిణ మధ్య రైల్వే ఈ సర్వీసును నడిపినట్టు తన తీర్పులో తెలిపింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇల్లు శుభ్రం చేస్తుండగా మహిళకు దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. అందులోఉన్నది చూసి షాక్‌ !!

Vettaiyan OTT: ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!

జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!

హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్

బాబోయ్ !! బ్లాస్టింగ్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న అనసూయ