Pune-Mumbai: పూణె-ముంబై రైలు మార్గంలో తప్పిన పెను ప్రమాదం.. ఏం జరిగిందంటే..?
పూణె-ముంబై రైలు మార్గంలో పెను ప్రమాదం తప్పింది. ఈ మార్గంలో రైలు పట్టాలపై వేర్వేరు చోట్ల దుండగులు బండరాళ్లు పెట్టారు. రైలు వస్తున్నప్పుడు అదురుకు అవి పడిపోకుండా వాటికి సపోర్టుగా మరికొన్ని రాళ్లు పేర్చారు. ఏకంగా ఐదు చోట్ల ఇలా బండరాళ్లను పెట్టారు దుండగులు. పూణె-ముంబై అప్లైన్పై వీటిని గుర్తించిన రైల్వే సిబ్బంది వాటిని తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది.
పూణె-ముంబై రైలు మార్గంలో పెను ప్రమాదం తప్పింది. ఈ మార్గంలో రైలు పట్టాలపై వేర్వేరు చోట్ల దుండగులు బండరాళ్లు పెట్టారు. రైలు వస్తున్నప్పుడు అదురుకు అవి పడిపోకుండా వాటికి సపోర్టుగా మరికొన్ని రాళ్లు పేర్చారు. ఏకంగా ఐదు చోట్ల ఇలా బండరాళ్లను పెట్టారు దుండగులు. పూణె-ముంబై అప్లైన్పై వీటిని గుర్తించిన రైల్వే సిబ్బంది వాటిని తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది తప్పకుండా సంఘవిద్రోహ శక్తుల పనేనని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శివాజీ మనాస్పూర్ తెలిపారు. ఆ మార్గంలో అప్పటికే పనిచేస్తున్న పెట్రోలింగ్ బృందం బండరాళ్లను తొలగించినట్టు పేర్కొన్నారు. సమీప ప్రాంతాల్లోనూ తనిఖీ చేస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. నాలుగు రోజుల క్రితం నార్త్ వెస్ట్రన్ రైల్వే అధికారులు ఉదయ్పూర్-జైపూర్ ట్రాక్పైనా బండరాళ్లను గుర్తించారు. వాటిని గమనించిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు సిబ్బంది బ్రేకులు వేసి ప్రమాదాన్ని నివారించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

